డ్రగ్స్ విక్రయిస్తున్నాడని యువకుడి కాళ్లు, చేతులు పూర్తిగా నరికేశారు, చివరికి అతను !
డ్రగ్స్ విక్రయిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ యువకుడిని స్థానికులు అతి కిరాతంగా హత్య చేసిన ఘటన పంజాబ్ లోని బతిండా ప్రాంతంలో జరిగింది. బతిండా ఊరిలో నివాసం ఉంటున్న వినోద్ కుమార్ (25) అనే యువకుడు హత్యకు గురైనా
బతిండా: డ్రగ్స్ విక్రయిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ యువకుడిని స్థానికులు అతి కిరాతంగా హత్య చేసిన ఘటన పంజాబ్ లోని బతిండా ప్రాంతంలో జరిగింది. బతిండా ఊరిలో నివాసం ఉంటున్న వినోద్ కుమార్ (25) అనే యువకుడు హత్యకు గురైనాడని పోలీసులు చెప్పారు.
వినోద్ కుమార్ డ్రగ్స్ విక్రయిస్తున్నాడని సమాచారం. ఇతని మీద అనేక కేసులు ఉన్నాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ఊరు వదిలి వెళ్లిపోవాలని, నీ కారణంగా ఇక్కడ ఉన్న యువకులు వ్యసనాలకు బానిసలు అవుతున్నారని గత సంవత్సరంలో వినోద్ కుమార్ కు వార్నింగ్ ఇచ్చారు.

వెలివేశారు. మళ్లీ వచ్చాడు !
8 నెలల క్రితం వినోద్ కుమార్ ను ఊరి నుంచి బయటకు పంపించేశారు. అయితే గురువారం రాత్రి వినోద్ కుమార్ సొంత ఊరు అయిన బతిండాకు వెళ్లాడు. ఆ సందర్బంలో స్థానికంగా నివాసం ఉంటున్న కొంత మంది యువకులు వినోద్ కుమార్ ను అడ్డుకున్నారు.

తిరగబడితే నరికేశారు !
వినోద్ కుమార్ తిరగబడంటంతో స్థానికులు సహనం కొల్పోయారు. పదునైన వేటకోడవళ్లు తీసుకుని వినోద్ కుమార్ కాళ్లు, చేతులు పూర్తిగా కత్తిరించేశారు. శరీరం నుంచి రెండు చేతులు, రెండు కాళ్లు తెగిపోవడంతో వినోద్ కుమార్ కుప్పకూలిపోయాడు.

చికిత్స చేస్తే మీ అంతు చూస్తాం !
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వినోద్ కుమార్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వినోద్ కుమార్ కు చికిత్స చెయ్యరాదని, చికిత్స చేస్తే మీ అంతుచూస్తామంటూ ఆసుపత్రి దగ్గర స్థానికులు గుమికూడి ఆందోళనకు దిగారు.

40 కిలోమీటర్ల దూరంలో!
స్థానిక ఆసుపత్రి దగ్గర ఆందోళన ఎక్కువ కావడంతో పోలీసులు వెంటనే వినోద్ కుమార్ ను 40 కిలోమీటర్ల దూరంలో మరో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రక్తం పూర్తిగా కారిపోవడంతో వినోద్ కుమార్ మరణించాడని బతిండా పోలీసులు చెప్పారు.

జైలు నుంచి బయటకు
ఓ కేసులో అరెస్టు అయిన వినోద్ కుమార్ జైలుకు వెళ్లి నాలుగు రోజుల క్రితం బెయిల్ మీద బయటకు వచ్చాడని పోలీసులు చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు వినోద్ కుమార్ ను హత్య చేశారని కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications