బెంగళూరు కంపెనీలో సెలవు ఇవ్వలేదని అనంతపురం యువకుడు ఏం చేశాడంటే ?, పిన్ టూ పిన్ !
ఫ్యాక్టరీలో సెలవు ఇవ్వలేదని ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బెంగళూరు నగరంలోని బాగల్గుంటే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. టి.దాసరహళ్లిలో నివాసం ఉంటున్న గోవిందరాజు అలియాస్ గోవింద్ (24) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని శనివారం బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.
సాయంత్రం సుమారు 5.30 గంటల సమయంలో టి దాసరహళ్లిలోని ఆర్పీఎం అపార్ట్మెంట్లో గోవిందరాజు ఆత్మహత్య చేసుకున్నాడని, అయితే రాత్రి ఆలస్యంగా తమకు సమాచారం అందిందని పోలీసులు అంటున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోని మడకశిరకు చెందిన గోవిందరాజు గత ఆరేళ్లుగా బెంగళూరులోని పీణ్యాలోని కేఆర్డీఆర్ వాచ్ లు తయారు చేసే కంపెనీలో పనిచేస్తున్నాడు.

ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న గోవిందరాజు దాసరహళ్లిలోని ఎర్పీఎం అపార్ట్మెంట్ లో మైంటెన్స్ పనులు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. రాత్రి పూట గోవిందరాజు ఇదే అపార్ట్మెంట్లో నిద్రిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల కేఆర్డీఆర్ వాచ్ లు తయారు చేసే కంపెనీలో పని చేస్తున్న మేనేజర్, సూపర్వైజర్ను తనకు సెలవు మంజూరు చెయ్యాలని, ఊరికి వెళ్లి వస్తానని గోవిందరాజ్ మనవి చేశాడని తెలిసింది.
అయితే సెలవు ఇవ్వలేమని మేనేజర్, సూపర్ వైజర్ గోవిందరాజుకు చెప్పారు. సెలవు అడిగితే ఉద్యోగం నుంచి తొలగిస్తామని ఇద్దరూ గోవిందరాజును బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో గోవిందరాజు విసుగు చెందినట్లు అతని సన్నిహితులు చెబుతున్నారు.గురువారం ఫ్యాక్టరీలో పనికి వెళ్లకుండా అపార్ట్మెంట్లోనే గోవింరాజు ఉండిపోయాడు. సాయంత్రం తరువాత చీరతో మెట్ల రెయిలింగ్కు ఉరేసుకున్న గోవింరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గోవిందరాజు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలో డెత్ నోట్ దొరికిందని పోలీసులు అన్నారు. ఫ్యాక్టరీ మేనేజర్ , సూపర్ వైజర్ తనకు సెలవు ఇవ్వకుండా వేధిస్తున్నారని, సెలవు అడిగితే ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారని, దీంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని గోవిందరాజు డెత్ నోట్ రాశాడని పోలీసులు తెలిపారు. బాగలగుంటె పోలీస్ స్టేషన్లో ఫ్యాక్టరీ మేనేజర్, సూపర్వైజర్పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
అతడు ఇప్పుడు పక్కా మెంటల్లీ టఫ్: రవిశాస్త్రి -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. -
ఫైనల్ వేళ టీమిండియాకు మాజీ కోచ్ హెచ్చరిక, అభిషేక్ బ్యాటింగ్ ఆర్డర్ ఇక..!! -
మీ పాత బంగారం చెల్లుతుందా? 2026 కొత్త నిబంధనలు ఇవే! -
EPF 2026 అమల్లోకి: డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చో తెలుసా? -
T20 world cup Final: ఫైనల్ అభిషేక్ దే-తేల్చేసిన టీమిండియా హీరో..! -
ఇరాన్ పోరాటం వెనుక రహస్య ఆయుధం? యూఎస్-ఇజ్రాయెల్ కు చిక్కని సీక్రెట్..! -
జీహెచ్ఎంసీ వాసులకు బిగ్ న్యూస్.. వారి ఆస్తులు సీజ్ కు రంగం సిద్ధం! -
ఆ ఉద్యోగుల జీతాలు నిలిపివేత, ఐఏఎస్ ల నుంచి జిల్లా స్థాయి వరకు - నిర్ణయం వెనుక..!!












Click it and Unblock the Notifications