బడ్జెట్ హైలైట్స్ : ఎన్ఆర్ఐలకు గుడ్న్యూస్, నిర్మలమ్మ ఏం చెప్పిందంటే ...
న్యూఢిల్లీ : విదేశాల్లో ఉండే భారతీయులకు గుడ్ న్యూస్. వారు ఆధార్ కార్డు కోసం నిబంధనలను మరింత సరళతరం చేసింది. ఆధార్ కార్డు కోసం వారు మరీ ఆరునెలలు వేచి ఉండాల్సిన అవసరం లేదని స్పస్టంచేసింది.
180 రోజులే .. కానీ ...
సాధారణంగా ఆధార్ కార్డు కావాలంటే .. ఇక్కడి ప్రతినిధులకైతే నెలరోజుల్లోపు ఇస్తారు. అదే విదేశాల్లో ఉండేవారికైతే కాస్త ఆలస్యమవుతోంది. గరిష్టంగా ఆరునెలలు .. అంటే 180 రోజుల సమయం పడుతుంది. దీంతో విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు ఆధార్ కార్డు కోసం పాట్లు పడేవారు. వారి ఇబ్బందులను గమనించిన కేంద్రం నిబంధనలను మరింత సరళతరం చేస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.

నిరీక్షించాల్సిన అవసరం లేదు ..
విదేశీ ప్రతినిధులు తమ పాస్పోర్టుతో ఆధార్ కార్డుకోసం ధరఖాస్తు చేయాలని కోరారు. అయితే వారికి వెంటనే ఆధార్ కార్డు ఇస్తామని పేర్కొన్నారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో వెయిట్ చేయించబోమని ప్రకటించారు. దీంతో చాలామంది ఎన్ఆర్ఐలకు మేలు జరగనుంది. విదేశాల్లో ఉండేవారు ఆస్తి క్రయ, విక్రయాలు, బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఆధార్ నంబర్ తప్పనిసరి అయిన నేపథ్యంలో ... ఆధార్ కార్డు వెంటనే ఇస్తామని వారికి ఉపశమనం కలిగించారు నిర్మలా.












Click it and Unblock the Notifications