ఆధార్ తప్పనిసరి కాదు, ఆప్షనల్ మాత్రమే: సుప్రీం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న వివిధ సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులకు ఆధార్తో అనుసంధానం తప్పనిసరి కాదని సుప్రీం కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. అయితే ప్రజా పంపిణీ వ్యవస్ధ, గ్యాస్ రాయితీలకు పొందాలంటే మాత్రం ఆధార్ తప్పనిసరి అని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది.
ఆధార్ కార్డు తప్పనిసరి కాదని పత్రికలు, టీవీల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆధార్లో పొందడానికి ప్రజలు ఇచ్చిన వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వరాదని, యఐడీఏఐ విభాగానికి ఆదేశాలు జారీ చేసింది.
ఆధార్ కార్డును వివిధ ప్రభుత్వ పథకాలకు అనుసంధానించడాన్ని సవాల్ చేస్తూ కొంత మంది వ్యక్తులు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ల కేసును సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మసనానికి బదిలీ చేసింది.
దీంతో సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం పై విధంగా తీర్పును వెలువరించింది. ఆధార్ కార్డు సమాచారాన్ని క్రిమినల్ కేసుల విచారణలో కూడా ఉపయోగించుకోవచ్చని ఆదేశించింది.