ఢిల్లీలో ఎఎపి ఫస్ట్.. కేజ్రీవాల్ సెకండ్!: మోడీదే హవా

న్యూఢిల్లీ: ఢిల్లీ గద్దెను ఎక్కిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) దేశ రాజధానిలో దాదాపు లోకసభ సీట్లను అన్నింటిని కైవసం చేసుకోనుందట. ఢిల్లీ - నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లోని ఏడు లోక్‌సభ సీట్లకుగాను ఆరింట పాగా వేయనుందట.ఎబిపి న్యూస్ కోసం ఎసి నీల్సన్ సంస్థ చేసిన సర్వేలో ఇది తేలింది.

ఇందులో భాగంగా నేషనల్ క్యాపిటల్ రీజియన్, ముంబై, గ్రేటర్ ముంబై ప్రాంతాల్లో సర్వే నిర్వహించింది. ఈ ప్రాంతాల్లోని మొత్తం 21 సీట్లకుగాను యూపిఏ గతంలో 17 సీట్లు గెలుచుకుంది. కానీ, 2014 ఎన్నికల్లో వీటిలో కేవలం మూడింటిలో మాత్రమే గెలుబోతుందట.

AAP to bag 6 Delhi Lok Sabha seats, Modi top PM choice: Poll

మిగతా 18 సీట్లలో ఎనిమిది ఎఎపికి, పది భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటాయని సర్వేలో తేలింది. పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ వ్యతిరేక ఓటుపై ఆశలు పెట్టుకున్న బిజెపికి ఈ సర్వే ఫలితాలు ఆందోళన కలిగించేవే అంటున్నారు.

మరోవైపు ప్రధాని అభ్యర్థిగా మెజారిటీ ఓటు మాత్రం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకే పడింది. ప్రధాని అభ్యర్థిగా మోడీకి ఢిల్లీలో 45% ఓట్లు పడితే, కేజ్రీవాల్‌కు 42% ఓట్లు వచ్చాయి. మోడీ మొదటి స్థానంలో ఉండగా, కేజ్రీవాల్ రెండో స్థానంలో ఉన్నారు.

ముంబై - థానేల్లో మాత్రం మోడీ (51%) కేజ్రీవాల్‌కు అందనంత (18%) దూరంలో ఉన్నారు. పైగా ఇక్కడ 22% ఓట్లతో ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ రెండో స్థానంలో నిలిచారు. ఎసి నీల్సన్ సంస్థ 21 నియోజకవర్గాల్లో ఒక్కో స్థానంలో 3 అసెంబ్లీ సీట్లలో 2585 మందిని ప్రశ్నించి ఈ సర్వే చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+