Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నిర్మలాస్త్రం పని చేసినట్టే- తొలి వికెట్ పడ్డట్టే

Exit Polls 2025 on Delhi: దేశ రాజధానిలో ఇక భారతీయ జనతా పార్టీ పాగా వేసినట్టే కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ముకుమ్మడిగా బీజేపీకి జిందాబాద్ కొట్టాయి. ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలకు తెర పడినట్టేనంటూ అంచనా వేశాయి. ఈ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురుతుందంటూ అభిప్రాయపడ్డాయి.

మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్నాయి ఢిల్లీ అసెంబ్లీలో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 36. 2013లో తలి సారిగా దేశ రాజధానిలో జెండా పాతింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇఫ్పటివరకూ చెక్కు చెదరలేదా పార్టీ ఓటుబ్యాంక్. ఇప్పుడు ఫలితం తిరగబడే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

AAP has lost its shine in Delhi as exit polls 2025 predicts several reasons including tax exemption

1998లో చివరిసారిగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీని పాలించింది. 2013లో కాంగ్రెస్ ఇక్కడ అధికారాన్ని కోల్పోయింది. అప్పటి నుంచీ ఈ రెండు పార్టీలను కాదని ఆమ్ ఆద్మీకే పట్టం కడుతూ వచ్చారు ఢిల్లీ ఓటర్లు. భారీ మెజారిటీతో ఆప్ అభ్యర్థులను గెలిపిస్తూ వస్తోన్నారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌కు ఏ మాత్రం కొరుకుడు పడట్లేదు హస్తినాపురి.

ఈ దఫా ఈ పరిస్థితి ఉండకపోవచ్చని తెలుస్తోంది. బీజేపీ అబ్జల్యూట్ మెజారిటీని సాధిస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. సగటును 35 నుంచి 45 వరకు నియోజకవర్గాల్లో బీజేపీ పాగా వేస్తుందని, ఆయా చోట్ల కాషాయ జెండా ఎగురుతుందంటూ అభిప్రాయపడ్డాయి. ఇవి- ఎంత వరకు వాస్తవరూపాన్ని దాల్చుతాయనేది ఈ నెల 8వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా తేలిపోతుంది.

కాగా ఆప్ ఓటమికి కారణాలేమై ఉండొచ్చనే అంచనాలు సైతం వెలువడుతున్నాయి. ఇందులో- ప్రధానంగా పన్ను మినహాయింపు బీజేపీకి ప్లస్ పాయింట్ అయిందని అంటున్నారు. ఢిల్లీలో నివసించే వారిలో అత్యధికులు ఉద్యోగులే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల ఉద్యోగులు మెజారిటీ సంఖ్యలో ఉన్నారక్కడ.

కేంద్ర బడ్జెట్‌లో 12 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపును ఇవ్వడం బీజేపీ గెలవడానికి ప్రధానంగా బాటలు వేస్తుందని అంటున్నారు. ఈ నిర్ణయం వల్ల వేల సంఖ్యలో ఉద్యోగులు ఆర్థికంగా లబ్ది పొందగలుగుతారు. ఆ కృతజ్ఞతను ఓటు రూపంలో బీజేపీకి తెలియజేసి ఉండొచ్చని చెబుతున్నారు.

అదే సమయంలో - ఢిల్లీ వాతావరణం విషపూరితం కావడం మరో కారణం అనే అంచనాలు ఉన్నాయి. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ రోజురోజుకూ దిగజారిపోతోండటం, యమునా నది మొత్తం కాలుష్యమయం అయిందనేది జగమెరిగిన సత్యం. దీన్ని బీజేపీ తన ప్రచారానికి వాడుకుంది. సక్సెస్ సాధించినట్టే కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+