కాలుష్యం తగ్గింది: సరి-బేసి విధానంపై హైకోర్టుకు నివేదిక
న్యూఢిల్లీ: కాలుష్య నియంత్రణ కోసం దేశ రాజధాని ఢిల్లీలో సరి-బేసి వాహన విధానం చేయడం వల్ల రద్దీ సమయాల్లో కాలుష్యం స్థాయి తగ్గిందని ఆప్ ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తన నివేదికలో వెల్లడించింది. ఈ విధానం ట్రయల్ రన్కు తమకు 15 రోజులు సరిపోదని, మరికొన్ని రోజులు పోడిగించే అవకాశం ఉందని కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం శుక్రవారం కోర్టుకు తెలిపింది.
ఢిల్లీ ప్రభుత్వం తరుపున సీనియర్ కౌన్సిల్ హరీష్ సాల్వే జనవరి 1 నుంచి 8వ తారీఖు వరకు సేకరించిన కాలుష్య డేటాను చీఫ్ జస్టిస్ జీ రోహిణి, న్యాయమూర్తి జయంత్ నాథ్లతో కూడిన ధర్మాసనం ముందు ఉంచారు. ఈ విధానం వల్ల ఢిల్లీలో చాలా చోట్ల ట్రాఫిక్ తగ్గినట్లు ఆయన తన వాదనను వినిపించారు.

సరి-బేసి విధానం అమలు చేయడం వల్ల ప్రజలు రవాణా సౌకర్యాల విషయంలో ఇబ్బందులకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజల అవసరాల కోసం త్వరలో మరిన్ని బస్సులను కొనుగోలు చేయనున్నట్లు ఆప్ ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది.
కాగా, సరి-బేసి విధానం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నట్లు కొందరు న్యాయస్థానికి వెళ్లిన నేపథ్యంలో కాలుష్యం ఏ మేరకు తగ్గిందో 8వ తేదీ వరకు నివేదిక ఇవ్వవలసిందిగా కోర్టు ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆప్ ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు నివేదకను సమర్పించింది.
రాజధాని ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం సరి-బేసి వాహన విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. సరి-బేసి వాహన ట్రయల్ రన్ విధానం జనవరి 1 నుంచి 15తో ముగియనుంది.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్












Click it and Unblock the Notifications