కొత్త నోట్ల కోసం ఓపిక నశించి బ్యాంకు అద్దాలు పగలగొట్టారు..
లక్నో : ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ లో.. ఓ బ్యాంకు అద్దాలను ధ్వంసం చేశారు ఖాతాదారులు. కొత్త నోట్ల కోసం గంటల తరబడి వేచియున్న ఖాతాదారులు.. సహనం నశించడంతో విధ్వంసానికి పాల్పడ్డారు. బ్యాంకు అద్దాలను పగలగొట్టిన అనంతరం బయట పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను కూడా ధ్వంసం చేశారు.
గంటల తరబడి 'క్యూ'లో వేచియున్నా.. నోట్ల మార్పిడిలో జాప్యం జరుగుతుండడంతో.. సహనం కోల్పోయి విధ్వంసానికి పాల్పడ్డారు. తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన ఖాతాదారులను శాంతింపజేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఖాతాదారులను కట్టడి చేసి.. ఆందోళనకారులను అక్కడినుంచి పంపించేశారు. దీంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.

కాగా, దేశవ్యాప్తంగా కొత్త నోట్ల మార్పిడి కోసం సామాన్య జనం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కొత్త నోట్లు తీసుకున్నవారు సైతం రూ.2వేల నోటుకు చిల్లర దొరకక నానా అవస్థలు పడుతున్నారు. ఏటీఎం కార్యకలాపాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మరింత సమయం పట్టే అవకాశముండడంతో.. ఈ ఇబ్బందులు మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగే అవకాశముంది.
ప్రస్తుత ఏటీఎంలు పాత నోట్ల డిజైన్ కు తగినవిధంగా రూపొందించినవి కావడంతో.. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన నోట్ల కోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను రూపొందించుకోవాల్సి ఉంది. దీంతో సామాన్యులకు పూర్తి స్థాయి ఏటీఎం సేవలు అందుబాటులోకి రావడానికి మరో 10రోజలైనా పట్టవచ్చు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications