చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆసుపత్రిలో కరుణానిధి కుటుంబ సభ్యులతో భేటీ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్

|
Google Oneindia TeluguNews

చెన్నై: చెన్నైలోని అళ్వార్ పేట్ లోని కావేరీ ఆసుపత్రిలో ఐదు రోజుల నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్న డీఎంకే పార్టీ చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ ఎం. కరుణానిధిని పరామర్శించడానికి సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ వెళ్లారు.

Recommended Video

కరుణానిధి ఆరోగ్యంపై వైద్యుల ప్రకటన, 12 ఏళ్ల తర్వాత నెరవేరిన ఆయన కల!

ఈ సందర్బంగా కరుణానిధి కుటుంబ సభ్యులను రజనీకాంత్ పరామర్శించారు. అనంతరం ఆసుపత్రిలో కరుణానిధి కుమారుడు. తమిళనాడు శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ తో రజనీకాంత్ చర్చించారు. కరుణానిధి ఆరోగ్యం గురించి రజనీకాంత్ ఆరా తీశారు.

Actor Rajinikanth visits Karunanidhi in Kauvery hospital in Chennai

అనంతరం మీడియాతో మాట్లాడిన రజనీకాంత్ దేశంలోనే అత్యంసీనియర్ రాజకీయ నాయకుడు అయిన కరుణానిధిని పరామర్శించడానికి తాను ఆసుపత్రికి వచ్చానని చెప్పారు. తాను ఆసుపత్రికి వెళ్లిన సమయంలో కరుణానిధి నిద్రపోతున్నారని, వారి కుటుంబ సభ్యుల నుంచి ఆయన ఆరోగ్యం ఎలా ఉందని వివరాలు సేకరించానని రజనీకాంత్ అన్నారు.

కరుణానిధి త్వరగా కోలుకుంటారని రజనీకాంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజలకు ఎంతో సేవ చేసిన కరుణానిధికి ఏమీ జరగదని, ఆయన ఆరోగ్యం కుదటపడుతుందని, ఆయన అభిమానులు ఆందోళన చెందకూడదని రజనీకాంత్ అన్నారు. కరుణానిధిని పరామర్శించడానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం సాయంత్రం చెన్నై వచ్చి వెళ్లిన విషయం తెలిసిందే.

English summary
Actor Rajinikanth on Tuesday night paid a visit to the Kauvery Hospital to inquire about the health of ailing DMK chief M. Karunanidhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X