భూటాన్ తో అదానీ పవర్ ఒప్పందం-6 వేల కోట్ల డీల్..!
భారత ఉపఖండ దేశం భూటాన్ కు ఇంధన భద్రత, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలే లక్ష్యంగా 6 వేల కోట్లతో అదానీ పవర్ చేపట్టనున్న జల విద్యుత్ ప్రాజెక్టుకు తొలి అడుగు పడింది. 570 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా అదానీ పవర్ తో పాటు భూటాన్ కు చెందిన డ్రంక్ గ్రీన్ పవర్ కార్పోరేషన్ ఉమ్మడిగా ఈ ప్రాజెక్టును నిర్మించబోతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణ ఒప్పందంపై ఇరు సంస్థలూ సంతకాలు చేశాయి.
భారత్ లో అతి పెద్ద ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్ద అయిన అదానీ పవర్.. భూటాన్ ప్రభుత్వ విద్యుత్ సంస్థ డ్రంక్ గ్రీన్ పవర్ కార్పోరేషన్ తో కలిసి వాంగ్చూ వద్ద ఈ మెగా ప్రాజెక్టును నిర్మించబోతోంది. ఇందుకోసం ఓ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపైనా ఇరు వర్గాలు సంతకాలు చేశాయి. భూటాన్ రాజ్యంతోనూ కన్సెషన్ అగ్రిమెంట్ పైనా అదానీ పవర్ సంతకాలు చేసింది. భూటాన్ ప్రధాని డాసూ త్సేరింగ్ టోబ్గే, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ ఇరు వైపుల నుంచీ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు.

ఈ మెగా జల విద్యుత్ ప్రాజెక్టును బూట్, ఓన్, ఆపరేట్, ట్రాన్స్ ఫర్ (బూట్ ) విధానంలో చేపడతారు. ప్రత్యామ్నాయ ఇంధన ప్లాంట్ నిర్మాణంతో పాటు దానికి అవసరమైన మౌలిక సదుపాయాల్ని ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తారు. ఇప్పటికే డీపీఆర్ దశ దాటిన ఈ ప్రాజెక్టు నిర్మాణం వచ్చే ఏడాది తొలి అర్ధభాగంలో ప్రారంభం కానుంది. ఐదేళ్లలో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
సుస్థిర అభివృద్ధిలో భూటాన్ ప్రపంచానికి ఒక రోల్ మోడల్ అని, ఈ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు ద్వారా దేశ సహజ వనరుల అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించడానికి తాము చాలా ఉత్సాహంగా ఉన్నామని అదానీ పవర్ సీఈవో ఎస్బీ ఖ్యాలియా తెలిపారు. వాంగ్చు జలవిద్యుత్ ప్రాజెక్టు భూటాన్ గరిష్ట శీతాకాల డిమాండ్ను చాలావరకు తీరుస్తుందన్నారు. ఆ సమయంలో జల విద్యుత్ ఉత్పత్తి తక్కువగా ఉంటుందని, వేసవి నెలల్లో ఇది భారతదేశానికి విద్యుత్ను ఎగుమతి చేస్తుందని తెలిపారు.

1960ల నుంచీ భారత్-భూటాన్ జలవిద్యుత్ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి కలిసి పనిచేశాయని, ఇది రెండు దేశాలకు ఎంతో ప్రయోజనం చేకూర్చిందని డీజీపీసీ ఎండీ దాషో చెవాంగ్ రింజిన్ తెలిపారు. భూటాన్ 2040 నాటికి మరో 15వేల మెగా వాట్ల జలవిద్యుత్ , 5వేల మెగా వాట్ల సౌర ఉత్పత్తి సామర్థ్యాన్ని జోడించాలని యోచిస్తోందన్నారు. అందువల్ల 570 మెగా వాట్ల వాంగ్చు జలవిద్యుత్ ప్రాజెక్టును స్థాపించడానికి అదానీ గ్రూప్తో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. వారి సాంకేతిక & ఆర్థిక బలం మరియు అదానీ గ్రూప్ తీసుకువచ్చే అపారమైన అనుభవం మరియు నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ప్రాజెక్ట్ అమలును వేగవంతం చేయాలని, ఇలాంటి ప్రాజెక్టులకు ఒక బెంచ్మార్క్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక నడిపించడంలో సాయపడటమే కాకుండా భూటాన్ ఇంధన భద్రతతో పాటు ఇరుదేశాల గ్రిడ్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుందన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications