Adani Power:దుమ్మురేపిన షేర్లు : లాభాల బాటలో..ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి..?
అదానీ పవర్స్లో షేర్లు కొన్న వారికి గుడ్ న్యూస్. అదానీ పవర్ షేర్లు ఒక్కసారిగా అంటే ఏకంగా 70శాతం మేరా లాభాల బాట పయనించాయి. అదానీ గ్రూప్ స్టాక్స్ జూన్ 3వ తేదీన రూ.97.35తో ముగియగా... బుధవారం అంటే జూన్ 9వ తేదీకి రూ 166.90తో ప్రారంభమైంది. అంటే ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారికి దాదాపు 70శాతం లాభం వచ్చింది. అయితే ఒక్కసారిగా ఈ పవర్ షేర్లు ఆకాశాన్ని తాకడం వెనక రెండు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు.
Recommended Video

ప్రభుత్వాలు డబ్బులు చెల్లించడంతో..
అదానీ పవర్కు సంబంధించి గ్రీన్ ఎనర్జీ కొనుగోలు మరియు చెల్లింపులు ప్రక్రియ జరిగింది. అదానీ పవర్ను కొనుగోలు చేసిన రాజస్థాన్ మరియు మహారాష్ట్ర ప్రభుత్వాలు కొంత కాలంగా డబ్బులు చెల్లించలేదు. అయితే అప్పటి నుంచి పెండింగ్లో ఉన్న చెల్లింపులను ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించడంతో షేర్ ధర కూడా పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు అదానీ పవర్ను జాబితా నుంచి తొలగించే ప్రక్రియ కూడా రద్దు కావడంతో అదానీ పవర్ షేర్లు ర్యాలీ అయ్యాయని నిపుణులు చెబుతున్నారు.

విద్యుత్ వాహనాల వైపు మొగ్గు
ఇక పెట్రోల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ప్రజలు విద్యుత్తో నడిచే వాహనాలవైపు మొగ్గు చూపుతున్నారని ఇది గ్రహించిన అదానీ సంస్థ గ్రీన్ ఎనర్జీ వైపు ఫోకస్ చేసి అందులో పెట్టుబడులు పెట్టిందని చెప్పారు. దీంతో మంచి లాభాలను చవి చూసిందని నిపుణులు చెప్పారు. అయితే దీర్ఘకాలంగా పెట్టుబడులు పెట్టిన వారు మాత్రం లాభపడ్డారని చెప్పుకొచ్చారు. దీనికి తోడు రాజస్థాన్, మహారాష్ట్ర ప్రభుత్వాలు పాక్షికంగా బిల్లులను చెల్లించడంతో అదాని పవర్ షేర్లు లాభాల బాట పట్టాయని వివరించారు. పాక్షికంగా అయినా పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించడంతో కొంతమేరకు అదానీ తన అప్పులను పూడ్చగలిగిందని నిపుణులు చెప్పారు.

ఎప్పుడు కొనాలి.. ఎప్పుడు అమ్మాలి
ఇక అదానీ పవర్ షేర్లు లాభాల బాట పట్టడానికి కొన్ని సాంకేతిక కారణాలు కూడా ఉన్నాయని నిపుణులు వివరించారు. గత నాలుగు రోజుల్లో 70శాతం మేరా లాభాలు వచ్చాయని చెప్పారు. రూ.100 వద్ద ప్రారంభమైన ర్యాలీ క్రమంగా రూ.150 మార్కును టచ్ చేసి కొత్త రికార్డు సృష్టించిందని చెప్పారు. అయితే ఎవరైతే ఇందులో ఇన్వెస్ట్ చేశారో వారు మాత్రం రూ.185 నుంచి రూ.190 మధ్య లాభం వచ్చినప్పుడు వెంటనే అమ్మకానికి పెట్టొచ్చని సూచిస్తున్నారు. ఇక అదానీ షేర్లను కొనుగోలు చేయాలనుకునేవారు రూ.120 నుంచి రూ.150 మధ్య ఉన్నప్పుడు షేర్లను కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇక్కడ ఇన్వెస్ట్ చేసి దీర్ఘకాలంగా ఉంచాలని కూడా రికమెండ్ చేస్తున్నారు. మరో 6-8 నెలల్లో అదానీ పవర్ షేర్ ధర రూ. 255 మార్క్ను టచ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications