APS Mundra: ఆశయాల నుంచి విజయాల దిశగా- అదానీ పబ్లిక్ స్కూల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు
ముంద్రాలోని అదానీ పబ్లిక్ స్కూల్ (APS) తన రజతోత్సవాలను ఘనంగా నిర్వహించుకుంది. కచ్ ప్రాంతంలో అకాడమిక్ ఎక్సలెన్స్, సామాజిక అభివృద్ధిలో పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకున్న సందర్భంగా ఈ వేడుక ఆదివారం జరిగింది. 2001లో ప్రారంభమైనప్పటి నుండి ఒక ప్రముఖ CBSE సంస్థగా ఎదిగిన సంస్థ ప్రస్థానాన్ని విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, ప్రముఖులు కలిసి జరుపుకున్నారు.
ఈ ఉత్సవాలకు అదానీ ఫౌండేషన్ ఛైర్పర్సన్ డాక్టర్ ప్రీతి అదానీ నాయకత్వం వహించారు. ఒక సాధారణ ఆలోచన నుంచి ఈ ప్రాంతంలోనే అగ్రగామి CBSE సంస్థల్లో ఒకటిగా పాఠశాల రూపాంతరం చెందిన తీరును ఆమె గుర్తు చేసుకున్నారు. APS ముంద్రా కేవలం ఒక విద్యాసంస్థ కాదని, "సంవత్సరాలుగా శ్రద్ధతో, నమ్మకంతో పెంచబడిన మొదటి సంతానం" వంటిదని ఆమె అభివర్ణించారు.

సుదూర ప్రాంతంలో నాణ్యమైన విద్యను అందించాలనే ఒక సాధారణ కల నుంచి ఈ పాఠశాల ప్రారంభమైందని డాక్టర్ అదానీ తెలిపారు. గుజరాత్ భూకంపంతో సహా అనేక సవాళ్లను ఎదుర్కొని, ప్రాజెక్టును వేగవంతం చేస్తూ నిర్మించబడిందని ఆమె వివరించారు. ప్రతికూల పరిస్థితులను అధిగమించడంలో ధైర్యం, పట్టుదల, సహకార స్ఫూర్తి ఎంత ముఖ్యమో ఆమె నొక్కి చెప్పారు.
ఈ సందర్భంగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మాట్లాడుతూ, ఈ 25 ఏళ్ల ప్రస్థానం కేవలం ఒక సంస్థను మాత్రమే కాకుండా, అనేక కలలను పెంచి, భవిష్యత్తులను తీర్చిదిద్దిందని అన్నారు. ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసం, పట్టుదల, సమాజానికి అర్థవంతంగా తోడ్పడాలనే ఆకాంక్షతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఆకర్షణగా కొత్త ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం నిలిచింది. ఇందులో బ్యాడ్మింటన్, పికిల్బాల్, టేబుల్ టెన్నిస్ సౌకర్యాలు ఉన్నాయి. 558 సీట్ల సామర్థ్యంతో అత్యాధునిక ఆడిటోరియం కూడా ప్రారంభమైంది, ఇది కచ్లోని అతిపెద్ద సౌకర్యాలలో ఒకటిగా పేరొందింది.
వేడుకల్లో STEM, రోబోటిక్స్ ప్రదర్శనలు, కళా ప్రదర్శనలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గత 25 ఏళ్ల పాఠశాల ప్రస్థానాన్ని చాటిచెప్పే ఒక లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. పాఠశాల మైలురాళ్లను డాక్యుమెంట్ చేస్తూ ఒక స్మారక కాఫీ టేబుల్ పుస్తకాన్ని కూడా విడుదల చేశారు. 233 విద్యార్థులు, 27 మంది అధ్యాపకులతో ప్రారంభమైన APS ముంద్రా ఇప్పుడు 2,300 మందికి పైగా విద్యార్థులు, 100 మందికి పైగా అధ్యాపకులతో అభివృద్ధి చెందింది.
పాఠశాల విజయగాథను తీర్చిదిద్దిన ప్రస్తుత, పూర్వ ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, సిబ్బంది కృషిని డాక్టర్ అదానీ ప్రశంసించారు. అకడమిక్స్, ప్రభుత్వ సేవ, వ్యాపారం, రక్షణ, క్రీడలు, ప్రదర్శన కళల వంటి వివిధ రంగాలలో తమదైన ముద్ర వేసిన పూర్వ విద్యార్థులను ఆమె కొనియాడారు. వారి విజయాలను పాఠశాల "గొప్ప వారసత్వం"గా అభివర్ణించారు.
ఈ వేడుకలు పాఠశాల గీతాలాపనతో ముగిశాయి. ఇది తదుపరి 25 సంవత్సరాల వృద్ధి, ఆవిష్కరణ మరియు ఉన్నతమైన లక్ష్యాల పట్ల నిబద్ధతను సూచించింది.












Click it and Unblock the Notifications