లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్, కౌంటింగ్ ఓట్ల తేడా 6 లక్షలు-టాప్ లో ఏపీ..! షాకింగ్ రిపోర్ట్..!
దేశవ్యాప్తంగా తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెలువడి ప్రభుత్వాల ఏర్పాటు కూడా పూర్తయిపోయినా దీనిపై అనుమానాలు మాత్రం ఇంకా తొలగిపోలేదు. ఏడు దశల్లో సాగిన ఎన్నికల పోలింగ్ పూర్తి కాగానే దశల వారీగా ఓట్ల శాతం వెల్లడించేందుకు ఈసీ అప్పట్లో నిరాకరించడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఇవి కాస్తా చినికి చినికి గాలివానగా మారి సుప్రీంకోర్టు వరకూ వెళ్లాయి. అయితే సుప్రీంకోర్టు దీనిపై తదుపరి విచారణకు సిద్దంగా లేకపోవడంతో అప్పటికి సద్దుమణిగింది.
కానీ సుప్రీంకోర్టు వరకూ వెళ్లి ఎన్నికల ఓట్ల శాతాలు వెల్లడించాల్సిందేనని పోరాటం చేసిన స్వచ్చంద సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ మాత్రం దీన్ని వదిలిపెట్టలేదు. ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతాల్ని, కౌంటింగ్ చేసిన ఓట్ల శాతాల్ని పోలుస్తూ డేటా విడుదల చేసింది. దీని ప్రకారం పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య దాదాపు 6 లక్షల ఓట్ల తేడా ఉందని తేల్చింది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో మరోసారి విచారణకు వస్తోంది.

దేశంలో 362 నియోజకవర్గాల్లో ఈవీఎంలలో నమోదు చేసిన ఓట్లలో చాలా వరకూ లెక్కించలేదని ఏడీఆర్ ఆరోపించింది. దీంతో పోలింగ్, కౌంటింగ్ మధ్య ఓట్ల తేడా 5.5 లక్షలకు పైగా ఉందని చెబుతోంది. 176 సీట్లలో ఈవీఎంల ద్వారా నమోదైన ఓట్ల కంటే దాదాపు 35,000 ఓట్లు ఎక్కువగా లెక్కించినట్లు ఏడీఆర్ పేర్కొంది. 538 లోక్సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు, ఓట్ల సంఖ్యకు మధ్య వ్యత్యాసం ఉందని ఎన్నికల సంఘం సొంత గణాంకాలు చెబుతున్నాయని ఏడీఆర్ వ్యవస్థాపకుడు జగ్దీప్ చోకర్ తాజాగా ఎన్టీటీవీకి తెలిపారు. దీనిపై ఈసీ స్పందించాలని ఆయన కోరారు. 2019 ఎన్నికల్లోనూ ఇలాగే జరిగిందని గుర్తుచేశారు.
Discrepancies between the votes cast and the votes counted in the 2024 Lok Sabha election: Multiple Perspectives#ADRReport: https://t.co/rSEYBMz5iq
— ADR India & MyNeta (@adrspeaks) July 30, 2024
To donate to ADR, click here: https://t.co/lK9cQpq1Ui#LokSabhaElections2024 pic.twitter.com/slCVCCLu63
మరోవైపు ఏడీఆర్ విడుదల చేసిన పోలింగ్, కౌంటింగ్ ఓట్ల తేడా గణాంకాల్లో ఆంధ్రప్రదేశ్ 85777 ఓట్లతో టాప్ లో ఉంది. ఆ తర్వాత రెండో స్ధానంలో ఒడిశా 63123 ఓట్ల తేడా కలిగి ఉంది. 53 వేల ఓట్ల తేడాతో మూడో స్దానంలో యూపీ, 51 వేల ఓట్ల తేడాతో నాలుగో స్ధానంలో తమిళనాడు ఉన్నాయి. అసోం, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ 30 వేల ఓట్లకు పైగా తేడా సూచిస్తున్నాయి. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లోనూ పోలింగ్, కౌంటింగ్ మధ్య 14 వేల 969 ఓట్ల తేడా వచ్చింది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications