ఘోరం: ఆకలిని తట్టుకోలేక పురుగుల మందు తాగిన చిన్నారులు
భోపాల్: మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాలో దారుణం జరిగింది. ఆకలికి తట్టుకోలేక చిన్నారులు పురుగుల మందు తాగారు. ఇది డిసెంబర్ 31వ తేదీన జరిగింది. ఈ విషయం తెలిసిన నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్) విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
వారం క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాలో కొందరు గిరిజనులకు రేషన్ దుకాణాల నుంచి సరకులు అందలేదు. దీంతో ఆయా కుటుంబాలు ఆకలితోనే ఉంటున్నాయి.

ఈ క్రమంలో ఆ కుటుంబాలలోని చిన్నారులు ఆకలికి తట్టుకోలేక పురుగుల మందు తాగారు. వెంటనే చిన్నారులను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. అయితే ఈ సమాచారాన్ని బయటకు రానీయలేదు.
స్థానిక మీడియా ద్వారా విషయం వెలుగు చూసింది. చిన్నారుల వయసు తెలియాల్సి ఉంది. దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఎన్సీపీసీఆర్ అధికారులను ఆదేశించింది.
-
టేస్టీ టేస్టీ "బెండకాయ మటన్ కర్రీ" ఎలా చేయాలంటే..? -
స్పైసీ 'గోంగూర పన్నీర్ కర్రీ'.. ఇలా చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్..! -
ఈ "చామదుంపల బిర్యానీ" ముందు నాన్ వెజ్ బిర్యానీలు కూడా తక్కువే !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications