తాజ్ మహల్ ఎవరు కట్టారో అనవసరం, అందులో భారతీయుల రక్తం, చెమట ఉంది: యోగి ఆదిత్యనాథ్
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అక్టోబర్ 26వ తేదీన తాజ్ మహల్ను సందర్శించనున్నారు. పర్యాటక కోణంలో తాజ్ మహల్ యూపీ ప్రభుత్వానికి చాలా ముఖ్యమైనదని చెప్పారు.
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అక్టోబర్ 26వ తేదీన తాజ్ మహల్ను సందర్శించనున్నారు. పర్యాటక కోణంలో తాజ్ మహల్ యూపీ ప్రభుత్వానికి చాలా ముఖ్యమైనదని చెప్పారు.
ఇక్కడకు వచ్చే పర్యాటకులకు భద్రత కల్పించడం ప్రభుత్వం బాధ్యత అని చెప్పారు. దీపావళి సందర్భంగా అయోధ్యలో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నామని చెప్పారు.

తాజ్ మహల్ గురించి యోగి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజ్ మహల్ను ఎవరు కట్టారనేది, ఎందుకు కట్టించాడనేది తమకు అనవసరమని చెప్పారు. అయితే ఆ కట్టడాన్ని భారతీయల రక్తం,చెమటతో నిర్మించారని గుర్తుంచుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications