పంజాబ్లో మరో దారుణం: బస్సులో మహిళ పట్ల ఘోరం, పట్టించుకోలేదు
చండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలోని మోగాలో జరిగిన లైంగిక దాడులు మరవకముందే ఆదివారం నాడు మరో సంఘటన వెలుగు చూసింది. మోగా జిల్లాలో రెండు దారుణ సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే. ఓ ఘటనలో బాలికను బస్సులో నుండి తోసివేయడంతో ఆమె మృతి చెందింది కూడా.
తాజాగా, ఖన్నా ప్రాంతంలో ఆదివారం నాడు మహిళను ఓ ప్రయివేటు బస్సులో లైంగికంగా వేధించారు. ఇందుకు సంబంఎధించి పోలీసులు సదరు ప్రయివేటు బస్సు డ్రైవర్, కండక్టర్ పైన కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. ఓ వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ప్రయివేటు బస్సులో ఆమె వెళ్తుండగా.. పక్కనున్న వ్యక్తి వేధించాడు. డ్రైవర్, కండక్టర్ సహాయాన్ని ఆమె కోరింది. అయితే వారు పట్టించుకోలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను సదరు వ్యక్తి వేధిస్తున్నప్పటికీ బస్సు డ్రైవర్, కండక్టర్ పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు.
గత వారం బస్సులో ఓ బాలిక పైన లైంగిక దాడి జరిగింది. అనంతరం ఆ బాలికను బస్సులో నుండి కిందకు తోసేశారు. గాయాలపాలైన ఆ బాలిక మృతి చెందింది. అడ్డుకోబోయిన ఆ బాలిక తల్లిని కూడా బస్సులో నుండి తోసేశారు. ఇది లోకసభలోను ప్రకంపనలు సృష్టించింది. ఈ బస్సు ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ కుటుంబానికి చెందినది. దీంతో, బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి రూ.30 లక్షలు ప్రకటించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications