పరిస్థితి మారదా! మృతదేహాన్ని ప్లాస్టిక్ బ్యాగ్ లో మోసుకెళ్లిన బీహారీలు
పాట్నా : మొన్నటి ఒడిశా ఘటన కళ్లముందు ఇంకా కదలాడుతూనే ఉండగా.. అలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా మరిన్ని చోటు చేసుకుంటుండడం శోచనీయం. అంబులెన్స్ లేని కారణంగా పోస్ట్ మార్టం నిర్వహించిన ఓ శవాన్ని కుటుంబ సభ్యులు ఓ ప్లాస్టిక్ బ్యాగ్ లో చుట్టి తీసుకెళ్లిన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.
సింటు కుమార్ అనే వ్యక్తి దాదాపు రెండు వారాల క్రితం ప్రమాదవశాత్తు గంగానదిలో పడి చనిపోయాడు. గత 25వ తేదీన అతడి మృతదేహాన్ని వెలికి తీయించారు పోలీస్ అధికారులు. అప్పటికే మృతదేహాం బాగా కుళ్లిపోయింది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కతియార్ లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే శవాన్ని పోస్టుమార్టానికి స్వీకరించని అక్కడి వైద్యులు.. అక్కడికి 86కి.మీ దూరంలో ఉన్న భాగల్పూర్ ఆసుపత్రికి మృతదేహాన్ని తీసుకెళ్లాలని సూచించారు.

అయితే మృతదేహాన్ని అంతదూరం తీసుకెళ్లడానికి తమ వద్ద అంత డబ్బు లేదని దయచేసి ఓ అంబులెన్స్ ఏర్పాటు చేయాలని సింటుకుమార్ బంధువులు ఆసుపత్రి సిబ్బందిని వేడుకున్నారు. నిర్లక్ష్యంగా స్పందించిన సిబ్బంది.. అసలు ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని శవాన్ని తరలించడం పోలీసుల బాధ్యత అని చెప్పి వారిని అక్కడి నుంచి పంపించేశారు. దీంతో దిక్కు తోచని స్థితిలో మృతదేహాన్ని ప్లాస్టిక్ బ్యాగులో చుట్టి మోసుకుంటూ వెళ్లారు సింటుకుమార్ బంధువులు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications