చైనా సోషల్ మీడియా వెబ్సైట్లో ఖాతా తెరిచిన భారత ప్రధాని (ట్వీట్)
న్యూఢిల్లీ: సోషల్ మీడియా వెబ్సైట్లలో భారత ప్రధాని నరేంద్రమోడీ హవా అంతకంతకు పెరుగుతోంది. తాజాగా ఆయన చైనా సోషల్ మీడియా వెబ్సైట్ 'సినా వైబో'లో ఖాతా తెరిచారు. చైనాలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ సోషల్ మీడియా వెబ్సైట్ను 30 శాతం మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉపయోగిస్తారు.
ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో చైనాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'హలో చైనా! వైబో ద్వారా చైనా స్నేహితులతో మాట్లాడడానికి ఎదురుచూస్తున్నాను' అని మోడీట్విట్టర్లో పోస్ట్ చేశారు.
你好中国!期待通过微博与中国朋友们互动.
Hello
China!
Looking
forward
to
interacting
with
Chinese
friends
through
Weibo.
pic.twitter.com/yQcKn9bqTE
—
Narendra
Modi
(@narendramodi)
May
4,
2015
అదే విధంగా వైబోలో కూడా మోడీ చైనా భాషలో మొదటి పోస్ట్ చేశారు. ప్రధాని మోడీ వైబోలో చేరిన గంటలోపే నాలుగు వేలకు మందికి పైగా ఆయన పేజీని లైక్ చేశారు. ప్రధాని నరేంద్రమోడీ తన మూడు రోజుల చైనా పర్యటనకు మే 14 నుంచి 16 వరకు వెళ్లనున్నారు.
చైనా పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ... చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సొంత గ్రామాన్ని సందర్శించనున్నారు. చైనాలో 500 మిలియన్లకు పైగా వినియోగిస్తోన్న ఈ సోషల్ మీడియా వెబ్సైట్లో ఖాతా తెరిచిన మొదటి భారతీయ రాజకీయ నేత నరేంద్రమోడీ. బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరూన్కి కూడా ఈ వైబోలో అకౌంట్ ఉంది.