తెరచుకున్న శబరిమల ఆలయం: 10 మంది ఏపీ మహిళలను వెనక్కి పంపారు
తిరువనంతపురం: ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం శనివారం తెరచుకుంది. 41 రోజులపాటు భక్తుల సందర్శనార్థం ఈ ఆలయం తెరిచి ఉంటుంది. కాగా, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చిన 10 మంది మహిళలను అక్కడ పోలీసులు వెనక్కి పంపారు.

పది మంది ఏపీ మహిళలు వెనక్కి..
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి శబమరి ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చిన 10-50 ఏళ్ల మధ్య వయస్సున్న పది మహిళలను పంబా నుంచే వెనక్కి పంపించారు. అయ్యప్ప దేవాలయానికి పంబా కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.

జిల్లా వ్యాప్తంగా పోలీసుల మోహరింపు
శనివారం సాయంత్రం 5 గంటలకు శబరిమల ప్రధాన పూజారి మహేశ్ కండారూ తెరిచారు. అయితే, సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు వస్తున్న మహిళలకు ఇప్పటికే బెదిరింపులు వస్తున్నాయి. ఈ క్రమంలో పథనమథ్తిట్ట జిల్లా వ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

మండల పూజ నేపథ్యంలోనే..
మండల పూజ పర్వదినాల నేపథ్యంలో అయ్యప్ప ఆలయాన్ని ఈరోజు తెరిచారు. శబరిమల అయ్యప్ప ఆలయానికి వచ్చే భక్తుల కోసం అన్ని వసతులు కల్పించామని జిల్లా కలెక్టర్ పీబీ నూహ్ తెలిపారు. మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం, వైద్య సేవలను ఈ ప్రాంతంలో వివిధ చోట్లలో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో..
కాగా, 2018, సెప్టెంబర్ 28న ఆలయం లోపలికి మహిళల ప్రవేశ నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. గతంలో 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలు ఆలయంలోకి ప్రవేశించడంపై నిషేధం ఉంది. అయితే, తాజాగా 2018లో ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. అయితే, శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటామని పలు సంస్థలు ఇప్పటికే పేర్కొన్నాయి.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications