దిష్టి బొమ్మ కాల్చబోయి: పంచెకు నిప్పు(వీడియో)
చెన్నై: జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎండీకే వ్యవస్థాపకుడు, ప్రతిపక్ష నేత విజయ్కాంత్పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు సీఎం జయలలిత, జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయ్కాంత్ తీరును నిరసిస్తూ, అధికార అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు చేపట్టిన దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది.
బుధవారం విల్లుపురంలో విజయ్ కాంత్ దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా, ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో అన్నా డీఎంకే పార్టీ కార్యకర్తలు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో ఇద్దరు కార్యకర్తల పంచెలకు నిప్పు అంటుకుంది. వెంటనే పక్కనే ఉన్న కార్యకర్తలు ఆ మంటలను ఆర్పివేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. కాగా, విజయ్ కాంత్ వైఖరిని జర్నలిస్టు సంఘాలు ఖండించగా, అన్నాడీఎంకే కార్యకర్తలు నిరసన ప్రదర్శించారు. విజయ్ కాంత్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన పోస్టర్లను కాల్చారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications