వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నాడీఎంకే తీవ్రనిర్ణయం: కలలపై మాట్లాడనని పన్నీరు, బీజేపీని లాగిన దినకరన్

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇటీవల గెలిచిన టీటీవీ దినకరన్, చిన్నమ్మ శశికళ వర్గానికి చెందిన వారిపై వేటు వేస్తోంది. తాజాగా మరో 130 మందిపై చర్యలు తీసుకుంది.

పార్టీలోనే తమకు రెబెల్‌గా తయారైన టీటీవీ దినకరన్ కేడర్‌ను తొలగించేందుకు అన్నాడీఎంకే చర్యలను వేగవంతం చేసింది. దాదాపు 130 మందిని దినకరన్ మద్దతుదారులుగా గుర్తించి శుక్రవారం వేటు వేసింది. పార్టీ నుంచి వారిని బహిష్కరించింది.

శశికళ, దినకరన్ కు మద్దతు, 100 మంది మీద వేటు వేసిన ఓపీఎస్; ఈపీఎస్, దెబ్బ ! శశికళ, దినకరన్ కు మద్దతు, 100 మంది మీద వేటు వేసిన ఓపీఎస్; ఈపీఎస్, దెబ్బ !

అన్నాడీఎంకే తీవ్ర నిర్ణయం

అన్నాడీఎంకే తీవ్ర నిర్ణయం

పార్టీకి సంబంధించిన వివిధ విభాగాల నుంచి వీరిని తొలగిస్తున్నట్లు అన్నాడీఎంకే ప్రకటన చేసింది. పార్టీ సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం, సహ సమన్వయకర్త, ముఖ్యమంత్రి పళనిస్వామి ఈ మేరకు ప్రకటన చేశారు. తిర్పూరు, పుదుకొట్టాయ్, ధర్మపురి ప్రాంతాల్లో పార్టీలో ఉన్న దినకరన్ వర్గీయులను తొలగించినట్లు ప్రకటన చేశారు. వీరిలో 65 మంది ఒక్క తిర్పూర్ నుంచే ఉన్నారు.

దినకరన్ హెచ్చరిక

దినకరన్ హెచ్చరిక

కాగా, అన్నాడీఎంకేలో ఓ ఐదారుగురు తమ సొంత ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని, వారు తమ పద్ధతిని మార్చుకోవాలని ఆర్కే నగర్ నుంచి గెలిచిన దినకరన్ అన్నారు. లేకపోతే ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఏం జరిగిందో ప్రభుత్వానికి అదే జరుగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం త్వరలో పడిపోతుందని పరోక్షంగా అన్నారు. ఈ ప్రభుత్వం కేవలం రెండు మూడు నెలలే ఉంటుందని చెప్పారు.

బీజేపీపై దినకరన్ విమర్శలు

బీజేపీపై దినకరన్ విమర్శలు

ఇదే సమయంలో దినకరన్... పన్నీరు, పళనిలతో పాటు బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు ఉత్తరాది మద్దతుతో నష్టం చేస్తున్నారన్నారు. ఉత్తరాది అని ఆయన బీజేపీని ఉద్దేశించి అన్నారు. బీజేపీ మీకు గుర్తును, పార్టీ పేరును ఇచ్చేలా చేయగలదేమో కానీ ప్రజల ఓట్లను మాత్రం ఇవ్వలేదన్నారు.

దినకరన్ కలలపై నేను మాట్లాడను

దినకరన్ కలలపై నేను మాట్లాడను

దినకరన్ వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం స్పందించారు. ప్రభుత్వం పడిపోతుందన్న వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. అది అంతా దినకరన్ కల మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఆయన కలలపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా దినకరన్ పరప్పన అగ్రహార జైలులో శశికళను కలిసిన విషయం తెలిసిందే. అరగంట పాటు భేటీ అయ్యారు. అయితే ఆమె ఒక్క మాట మాట్లాడలేదు. అందుకు ఆమె మౌనవ్రతం చేస్తుండటమే కారణమని చెప్పారు. చూపులతో పలకరించి, నవ్వేశారు.

English summary
The ruling AIADMK continued its crackdown on the rebel TTV Dhinakaran camp by sacking more than 130 functionaries today for bringing "disrepute" to the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X