జయలలిత కోసం ఆత్మహత్యలు: వారి కుటుంబాలకు రూ. 7కోట్ల పరిహారం

చెన్నై: గత సంవత్సరం కిందిస్థాయి కోర్టు ఏఐఏడిఎంకె అధ్యక్షురాలు జయలలితను దోషిగా తేల్చిన అనంతరం ఆమె జైలుపాలయ్యారు. తమ నేత జైలుపాలు కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన పలువురు ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

అయితే మే 11న కర్ణాటక హైకోర్టు జయలలితను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిర్ధోషిగా తేల్చింది. దీంతో ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో తన కోసం ఆత్మహత్యలు చేసుకున్న 244 మందికి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని ఏఐఏడిఎంకె నిర్ణయించింది. దీంతో వారి కుటుంబాలకు రూ. 7 కోట్లు పరిహారం ఇవ్వనున్నట్లు ఏఐఏడిఎంకె శనివారం ప్రకటించింది.

jayalalitha

‘రూ. 7.32 కోట్ల మొత్తాన్ని చనిపోయిన వారి పరిహారంగా ఇవ్వనున్నాం. ఆత్మహత్యకు ప్రయత్నించి తీవ్ర గాయాలపాలైన నలుగురి చికిత్స కోసం రూ. 2లక్షలు ఇవ్వనున్నాం' అని పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.

మొత్తం రూ. 7.34 కోట్లను పరిహారంగా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. కాగా, ఏఐఏడిఎంకె పార్టీ అధినేత్రి జయలలిత.. చనిపోయినవారి ప్రతీ కుటుంబానికి రూ. 3లక్షల పరిహారం ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+