తమిళనాట నడిరోడ్డుపై అన్నాడీఎంకే నేత హత్య, శశికళ సంతాపం
తమిళనాడులో పట్ట పగలు నడి రోడ్డు పైన అన్నాడీఎంకే పార్టీ నాయకుడిని హత్య చేశారు. కాపు కాసి మరీ అతనిని చంపేశారు. సహచరులతో ఆస్తి వివాదాలే ఈ హత్యకు కారణంగా చెబుతున్నారు. రాజకీయ కారణాలు లేవు.
చెన్నై: తమిళనాడులో పట్ట పగలు నడి రోడ్డు పైన అన్నాడీఎంకే పార్టీ నాయకుడిని హత్య చేశారు. కాపు కాసి మరీ అతనిని చంపేశారు. సహచరులతో ఆస్తి వివాదాలే ఈ హత్యకు కారణంగా చెబుతున్నారు. రాజకీయ కారణాలు లేవు.
హత్యకు గురైన వ్యక్తి కనగరాజ్ (40). అతను అన్నాడీఎంకే పార్టీ తిరువన్నామలై నగర నాయకుడు. అతను కొద్ది నెలల క్రితం వరకు టౌన్ సెక్రటరీగా పని చేశాడు. ఆదివారం ఉదయం ఆయన రోడ్డు పైన వెళ్తుండగా ఆయుధాలతో వచ్చిన ముగ్గురు అతనిని చంపేశారు.
ఈ దాడికి రూ.3 కోట్ల లావాదేవీలు కారణమని గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. కనగరాజ్ ఉదయం పూట బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత బైక్ పైన ఇంటికి వస్తున్నాడు. ఈ సమయంలో ముగ్గురు కారులో వచ్చి ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు.

అతనిని బైక్ పై నుంచి కింద పడేశారు. ఆ తర్వాత కత్తితో పొడిచి చంపేశారు. కనగరాజ్ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. కాగా, హత్య చేసిన వారు ప్రతిపక్ష డీఎంకే మద్దతుదారులుగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఆయన మృతి పట్ల అన్నాడీఎంకే అధినేత్రి శశికళ ప్రగాడ సానుభూతి తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్య చేసిన ముగ్గురు.. రూ.5 కోట్ల విలువ చేసే భూమిని కనగరాజ్కు ఏడాది క్రితం అమ్మారు. అతను దానిని మూడో పార్టీకి అమ్మాడు. కానీ, తాను భూమి కొన్న పై ముగ్గురికి మాత్రం అతను పూర్తిగా డబ్బులు ఇవ్వలేదు. పలుమార్లు అడిగారు. ఎంతకూ ఇవ్వకపోవడంతో వారు హత్య చేశారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications