Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజస్తాన్ లో కూలిన మిగ్ 21 యుద్ధ విమానం..ముగ్గురు గ్రామస్తులు దుర్మరణం

రాజస్తాన్ లోని హనుమాన్ ఘర్ లో ఇవాళ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. భారత వాయుసేనకు చెందిన మిగ్ -21 యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలను చనిపోయినట్లు తెలుస్తోంది. సూరత్ ఘర్ నుంచి బయలుదేరిన ఈ విమానం హనుమాన్ ఘర్ ప్రాంతంపై నుంచి వెళ్తుండగా కుప్పకూలినట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన ఎయిర్ ఫోర్స్ అధికారులు సహాయక చర్యలపై దృష్టిపెట్టారు.

aircraft crashed

రాజస్తాన్ లోని హనుమాన్ ఘర్ లో మిగ్ 21 కూలిన ఘటనలో ఈ గ్రామానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది. అయితే విమాన పైలట్ మాత్రం సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. సూరత్ ఘర్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపం కారణంగా విమానం కుప్పకూలినట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని ముందే ఊహించిన పైలట్ పారాచూట్ సాయంతో దూకేసి ప్రాణాలు దక్కించుకున్నారు.

పైలట్ కొద్దిపాటి గాయాలతో బయటపడినట్లు ఎయిర్ ఫోర్స్ వర్గాలు ప్రకటించాయి. అతన్ని స్ధానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరుగుతుందని తెలిసి పైలట్ చాకచక్యంగా గ్రామం బయటకు విమానాన్ని నడిపినట్లు అధికారులు తెలిపారు. దీంతో భారీగా ప్రాణనష్టం తప్పినట్లు తెలిపారు. అదే గ్రామంలో ఇళ్లపై ఇది కూలి ఉంటే మరింత మంది మృత్యువాత పడే వారని తెలుస్తోంది.

మరోవైపు మిగ్ 21 ప్రమాద ఘటన తెలియగానే రాష్ట్ర పోలీసులతో పాటు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎయిర్ ఫోర్స్ వేర్వేరు విచారణలకు ఆదేశించాయి. సాంకేతిక లోపంతోనే మిగ్ 21 కూలినట్లు ప్రాథమికంగా గుర్తించినా ఇతర కోణాల్లోనూ దర్యాప్తు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో మిగ్ 21 ప్రమాదాన్ని ఎయిర్ ఫోర్స్ కూడా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+