రూ. 1,400 కోట్ల వ్యయాన్ని తగ్గించుకోనున్న ఎయిర్ ఇండియా
న్యూఢిల్లీ: దేశీయ విమానయాన దిగ్గజం ఎయిర్ ఇండియాను కేంద్రం ఖర్చులు తగ్గించుకోవాలని ఆదేశించిన వెంటనే ఆ దిశగా చర్యలను ప్రారంభించింది ఎయిర్ ఇండియా. ఇందులో భాగంగా ముందు సిబ్బందిని తగ్గించుకోవాలని ఎయిర్ ఇండియా నిర్ణయం తీసుకుంది.

దీని ద్వారా సుమారు రూ. 1,400 కోట్ల రూపాయలను ఎయిర్ ఇండియా మిగుల్చుకోనుంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఆరు శాతం ఖర్చులు తగ్గించుకోవడాన్ని ఎయిర్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. 2012లో ఎయిర్ ఇండియా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో కేంద్రం 35వేల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ ఇచ్చి ఆదుకున్న విషయం తెలిసిందే.
ఇకపై ఆర్థిక ప్యాకేజీలు ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ఎయిర్ ఇండియా నష్ట నివారణ చర్యలు చేపట్టింది. సిబ్బంది ప్రయాణంతో పాటు హాస్పిటాలిటీకి సంబంధించి కొన్ని పరిమితులను ఎయిర్ ఇండియా విడుదల చేసింది.












Click it and Unblock the Notifications