యాత్రికన్ కృపయా ద్యాన్దే: దేశంలో విమానాల రాకపోకల పునరుద్దరణ, ఇంటర్నేషనల్ ప్లైట్స్ కూడా..
ప్రయాణికులకు శుభవార్త. డొమోస్టిక్ ప్లైట్స్ కొన్ని ప్రయాణించేందుకు కేంద్ర పౌరవిమానయాన శాఖ అనుమతిచ్చింది. మే 4 వ తేదీ నుంచి ఎంపికచేసిన రూట్లలో విమానాలను ఆయా సంస్థలు నడిపిస్తాయి. అయితే అందుకు తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటారు.
మే 4 వ తేదీ నుంచి దేశంలో విమాన సర్వీసులను ప్రారంభిస్తామని ఎయిర్ ఇండియా పేర్కొన్నది. కరోనా వైరస్ వల్ల మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ ఉన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ విమానాలను కూడా మే 31వ తేదీ వరకు నిలిపివేశారు. దేశంలో ప్లైట్లను నడిపిన తర్వాత.. జూన్ 1వ తేదీ నుంచి అంతర్జాతీయ సర్వీసులు తిప్పుతామని ఎయిర్ ఇండియా తన వెబ్సైట్లో పేర్కొన్నది.
దేశంలో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తామని ఎయిర్ ఇండియా పేర్కొన్నది. ప్రయాణికుల ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్కీనింగ్ చేస్తామని స్పష్టంచేసింది. కరోనా వైరస్ ప్రబలడంతో దేశంలో మార్చి 25వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు మొదటి విడత లాక్ డౌన్ విధించారు. రెండో విడత ఏప్రిల్ 14వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి అన్ని విమాన సర్వీసుల బుకింగ్స్ నిలిపివేశారు. డొమోస్టిక్, ఇంటర్నేషనల్ ప్లైట్స్ టికెట్ల బుకింగ్ రద్దుచేశారు.