ఎయిరిండియా స్కాం: చిదంబరంను ప్రశ్నించిన ఈడీ
న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరంను ఏవియేషన్ స్కాంకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు శుక్రవారం విచారించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలు నుంచి బెయిల్పై విడుదలైన నెల రోజుల వ్యవధిలోనే ఎయిరిండియా స్కాంలో ఈడీ విచారణ చేపట్టింది.
ఆరుగంటలపాటు ఈడీ అధికారులు చిదంబరాన్ని ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి 2019 ఆగస్టు 23న తమ ఎదుట హాజరుకావాలంటూ ఈడీ అధికారులు చిదంబరంకు గతంలోనే సమన్లు చేశారు. అయితే, ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆగస్టు 20న సీబీఐ చిదంబరంను అరెస్ట్ చేయడంతో ఈడీ ముందు హాజరుకాలేకపోయారు.

ఎయిర్ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ కొనుగోలుకు సంబంధించిన కేసులో సంబంధిత ఫైలుపై చిదంబరం ఆమోదం తెలిపారని తేలడంతో ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. 2009లో ఎయిర్ బస్ నుంచి 43 విమానాలు కొనుగోలు చేయాలనే కాంట్రాక్టును పీ చిదంబరం నేతృత్వంలోని మంత్రుల కమిటీ ఖరారు చేసినట్లు సమాచారం.
111 విమానాల కోసం రూ. 70వేల కోట్లు వెచ్చించేందుకు ఈ డీల్ చేసుకున్నారు.
కాగా, ఈ ఒప్పందాన్ని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ముందుకు పంపినప్పుడు సదరు కంపెనీ శిక్షణా సదుపాయాలు, నిర్వహణ, మరమ్మతుల(ఎంఆర్ఓ) కేంద్రాల అభివృద్ధి చేయాలనే షరతులను చేర్చి కొనుగోలు ఆర్డర్లో మాత్ర ఆ క్లాజును తొలగించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే చిదంబరంను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications