విమానం ఇంజన్ లో ఇరుక్కుని దుర్మరణం
ముంబై: పార్కింగ్ చేసి ఉన్న విమానం ఇంజన్ స్టార్ట్ చెయ్యడంతో అక్కడే ఉన్న ఉద్యోగి ఇంజన్ లో ఇరుక్కుని దుర్మరణం చెందిన సంఘటన ముంబైలో జరిగింది. ఎయిర్ ఇండియాలో గ్రౌండ్ క్రూ సభ్యుడిగా (టెక్నీషియన్) ఉద్యోగం చేస్తున్న రవి సుబ్రమణియన్ అనే వ్యక్తి దుర్మరణం చెందాడు.
ముంబైలోని చత్రపతి శివాజీ డొమెస్టిక్ ఎయిర్ పోర్టులోని 28వ బే వద్ద ఎయిర్ ఇండియాకు చెందిన విమానం A1 619 పార్క్ చేశారు. ఈ విమానం ముంబై నుంచి హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. బుధవారం రాత్రి 8.45 గంటల సమయంలో రవి సుబ్రమణియన్ ఆ విమానం దగ్గరకు వెళ్లారు.

విమానం ఇంజన్ దగ్గర పరిశీలిస్తున్నాడు. అదే సందర్బంలో విమానం కో-పైలెట్ ఒక సిగ్నల్ ను తప్పుగా అర్థం చేసుకుని ఇంజన్ స్టార్ట్ చేశాడు. విమానం ఇంజన్ ఫ్యాన్లు రవి సుబ్రమణియన్ ను ఒక్క సారిగా లోపలికి లాగేసుకున్నాయి.
రవి సుబ్రమణియన్ సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న అధికారులు, సాటి ఉద్యోగులు సంఘటనా స్థలానికి పరుగు తీశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని ఎయిర్ ఇండియా సీఎండీ అశ్వనీ లోహానీ తెలిపారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications