ఎయిర్సెల్ నుంచి బంపర్ ఆఫర్.. రూ.3కే 1జీబీ 3జీ డేటా
ఎయిర్సెల్ మరో బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది. ‘గుడ్ మార్నింగ్ ప్యాక్’ పేరుతో కేవలం మూడు రూపాయలకే ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 1జీబీ 3జీ డేటాను ఇస్తున్నట్టు తెలిపింది.
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో పుణ్యమా అని వినియోగదారులు ఆఫర్ల వర్షంలో మునిగి తేలుతున్నారు. టెలికాం నెట్ వర్క్ కంపెనీలన్నీ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ ఖాతాదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
నిన్న వొడాఫోన్ రూ.6కే అపరిమిత డేటా ఆఫర్ ప్రకటించగా, మంగళవారం బీఎస్ఎన్ఎల్ రూ.5కే రోజుకు 4జీబీ 3జీ డేటాను ప్రకటించింది. ఆ ప్రకటన వెలువడి గంటలైనా కాకముందే ఎయిర్సెల్ మరో బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది.

కేవలం మూడు రూపాయలకే 1జీబీ 3జీ డేటాను ఆఫర్ చేస్తూ ఎయిర్సెల్ ప్రకటన విడుదల చేసింది. 'గుడ్ మార్నింగ్ ప్యాక్' పేరుతో కేవలం మూడు రూపాయలకే ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 1జీబీ 3జీ డేటాను ఇస్తున్నట్టు తెలిపింది.
అయితే ఇది కేవలం జమ్ముకశ్మీర్ సర్కిల్కు మాత్రమే వర్తిస్తుందని మెలిక పెట్టింది. ఈ ఆఫర్ను వినియోగించుకునేందుకు వినియోగదారులు *121*100# డయల్ చేయాల్సి ఉంటుంది.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications