ఎయిర్ క్రాప్ట్ క్యాష్: ల్యాండ్ చేస్తుండగా ప్రమాదం, అంతా సేఫ్
మధ్యప్రదేశ్లో ఓ ట్రైనీ హెలికాప్టర్ కూలింది. సాగర్ జిల్లా ధాన వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో అందులో ఉన్న ఇద్దరు సహా ట్రైనీ, శిక్షకుడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. రన్ వేపై ల్యాండ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది.
ధానకు చెందిన చిమిస్ ఏవియేషన్ అకాడమీకి చెందిన సింగిల్ ఇంజిన్ క్రాప్ట్, సెన్నా 172 కూలింది. గతేడాది కూడా ఎయిర్ క్రాప్ట్ కూలడంతో.. ఎయిర్ స్ట్రిప్ను అకాడమీ నిషేధం విధించింది. ఆ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. దీంతో కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. కానీ తర్వాత నిషేధం ఎత్తివేశారు. దీంతో మళ్లీ ట్రైనింగ్ జరుగుతోంది.
Recommended Video
ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సిందియా స్పందించారు. అదృష్టవశాత్తు అందరూ సేఫ్గా ఉన్నారని చెప్పారు. ఘటనపై విచారణ జరిపిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. గత 18 నెలలో రెండో సారి ప్రమాదం జరిగింది. 2009లో కూడా నర్మద నదీ వద్ద గల బాగ్రీ డ్యామ్ను కూడా ఎయిర్ క్రాప్ట్ ఢీ కొంది.