నువ్వా? నేనా?: జియోకు పోటీగా.. ఎయిర్ టెల్ కొత్త ఆఫర్లు
రిలయన్స్ జియోకు ఎయిర్ టెల్ షాకిచ్చింది. జియో ప్రైమ్ మెంబర్ల కోసం అందుబాటులోకి తీసుకురానున్న రెండు కొత్త ప్లాన్స్ ను ఎయిర్ టెల్ తాజాగా ప్రకటించింది.
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో షాక్ తో అంతకంతకూ దిగి వస్తున్న టెలికాం కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తూ రేసులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ముఖ్యంగా మార్కెట్ లీడర్ భారతి ఎయిర్ టెల్ అతి చవకైన రెండు కొత్త ప్లాన్స్ పరిచయం చేసింది. రిలయన్స్ జియో ప్రైమ్ మెంబర్ల కోసం అందుబాటులోకి తీసుకురానున్న కొత్త ప్లాన్స్ ఎయిర్ టెల్ ప్రకటించింది.
ఇప్పటికే తన 3జీ, 4జీ ధరల్లో కోత పెట్టింది. ఇప్పుడు జియోకు పోటీగా అంతకు మించి చౌకైన ప్లాన్స్ ఎయిర్ టెల్ అదిస్తోంది. జియో తరహాలో ప్రతీ నెల రూ.300కు 30 జీబీ డేటా కాకుండా.. కేవలం రూ.145కే 14జీబీ 3జీ లేదా 4జీ డేటా చిన్న ప్యాక్ ను ఎయిర్ టెల్ ఆఫర్ చేస్తోంది.
రూ.145 రీచార్జ్ ప్లాన్ పై 14 జీబీ.. 3జీ లేదా 4జీ డేటాతోపాటు ఎయిర్ టెల్ టు ఎయిర్ టెల్ ఫ్రీ కాలింగ్ సదుపాయం కూడా కల్పించింది. ఇక రూ.349 రీచార్జ్ ప్యాక్ లో 14 జీబీ 3జీ లేదా 4జీ డేటాతోపాటు అన్ని నెట్ వర్క్ లకు అపరిమిత కాలింగ్ సదుపాయం ఉంటుంది.