ఐశ్వర్యరాయ్తో తేజ్ప్రతాప్ నిశ్చితార్ధం, 200 మంది అతిథులు
పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ప్రతాప్ యాదవ్కు, ఐశ్వర్యరాయ్కు బుధవారం నాడు నిశ్చితార్ధం జరిగింది. బీహార్ రాష్ట్రంలోని పాట్నాలోని మౌర్య హోటల్లో వీరిద్దరి నిశ్చితార్ధం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పశుదాణా కుంభకోణంలో జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. దీంతో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాలేకపోయాడు.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ప్రతాప్, ఐశ్వర్యరాయ్లు రింగులు మార్చుకొన్నారు. నిశ్చితార్ధం కోసం ముఖ్యమైన 200 మంది అతిథులను లాలూ కుటుంబం ఆహ్వానించింది. ఈ నిశ్చితార్ధం కోసం మౌర్య హోటల్ను ప్రత్యేకంగా అలంకరించారు.

దేశంలోని పూణె, బెంగుళూరు, కోల్కత్తా, ఢిల్లీల నుండి తెచ్చిన ప్రత్యేక పుష్పాలతో హోటల్ను అలంకరించారు. పలువురు రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మే 12వ తేదిన పాట్నాలోని వెటర్నరీ కాలేజీ కాంపౌండ్లో తేజ్ ప్రతాప్, ఐశ్వర్యరాయ్ వివాహం జరగనుంది.
వీరిద్దరి వివాహా నిశ్చితార్ధానికి లాలూ సోదరీమణులు పాట్నాకు వచ్చారు.తేజ్ ప్రతాప్ యాదవ్ వివాహం చేసుకోబోతున్న ఐశ్వర్యరాయ్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి ధరోగా ప్రసాద్ రాయ్ మనవరాలు. ఆమె తండ్రి చంద్రికారాయ్ బీహార్ మంత్రిగా పనిచేశారు. పాట్నాలోనే హైస్కూల్ వరకు చదివిన ఐశ్వర్యరాయ్ ఢిల్లీలో ఉన్నతవిద్యను అభ్యసించారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications