అజ్మీర్ దర్గాను బాంబులతో పేల్చేస్తామని ఫోన్
అజ్మీర్: దేశ విదేశాలలో ఎంతో ప్రాచుర్యం పొందిన అజ్మీర్ దర్గాను బాంబులతో పేల్చేస్తామని బెదిరించారు. పోలీసు అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ఆ సందర్బంలో అజ్మీర్ దర్గాలో లక్ష మందికి పైగా భక్తులు ఉన్నారు. భక్తులు ఆందోళనతో హడలిపోయారు.
12వ శతాబ్ధం నాటి ఖ్వాజా గరీబ్ నవాజ్ దర్గాలో సోమవారం ఉదయం భక్తులు ఉన్నారు. అందరూ ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఉదయం 6.40 గంటల సమయంలో ఓ వ్యక్తి ఫోన్ చేసి దర్గాలో బాంబులు పెట్టామని, నిమిషాలలో పేల్చివేస్తామని బెదిరించారు.
విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు, బాంబు నిర్వీర్యదళాలు, పొలీసు జాగిలాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లోపల ఉన్న భక్తులను అన్ని గేట్లు నుంచి బయటకు పంపించారు. దర్గా చుట్టు ఉన్న పరిసర ప్రాంతాలు ఖాళీ చేయించారు.

క్వీక్ రెస్పాన్స్ బృందాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పోలీసు కమాండోలు బాంబు డిటెక్టర్లతో సుమారు గంట పాటు దర్గాలో క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి బాంబులు కనపడకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఉదయం 7.45 గంటల నుంచి 9.15 గంటల వరకు అజ్మీర్ దర్గాను మూసివేశారు. భక్తులతో పాటు పోలీసులను హడలు పుట్టించిన ఆ ఉత్తుత్తి బాంబు బెదిరింపు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది అని అధికారులు ఆరా తీస్తున్నారు. ముందు జాగ్రత చర్యగా అజ్మీర్ దర్గా దగ్గర గట్టి పోలీసు బందోబస్తు ఎర్పాటు చేశారు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!!












Click it and Unblock the Notifications