వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేప్‌లు: నిధులు తగ్గించి లగ్జరీ కార్లు కొన్న సీఎం అఖిలేష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Akhilesh gets luxury cars, but cuts Budget for women's panel
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఓ వైపు మహిళల పైన దారుణాలు జరుగుతుంటే.. మరోవైపు మహిళా కమిషన్‌కు ప్రభుత్వం నిధులు తగ్గించడమే కాకుండా ఆ నిధులతో లగ్జరీ కార్లు కొనడం వివాదాస్పదమవుతోంది. ఇటీవల యూపిలో యువతుల పైన అత్యాచారాలు, మహిళల పైన దాడులు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇలాంటి సమయంలో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం గురించిన ఓ షాకింగ్ అంశాన్ని ఆ ఆర్టీఐ కార్యకర్త బహిర్గతం చేశారు. అఖిలేష్ ప్రభుత్వం మహిళా కమిషన్‌కు నిధులకు కోత పెట్టినట్లు ఆర్టీఐ కార్యకర్త సేకరించిన సమాచారం వెల్లడించింది.

అంతేకాదు ఆ మొత్తాన్ని యూపీ ప్రభుత్వం రెండు సెవన్ సీటర్ మెర్సిడెజ్ కార్లు, రెండు లాండ్ క్రూయిజర్ కార్లు కొనేందుకు వెచ్చించిందట.

సామాజికవేత్త ఊర్వశి శర్మ సమాచార హక్కు చట్టం ద్వారా మహిళా కమిషన్‌కు కేటాయించిన నిధుల వివరాలు అడిగారు. గత మూడేళ్లుగా సమాజ్‌వాది ప్రభుతవం మహిళా కమిషన్‌కు నిధులు క్రమంగా తగ్గించినట్లుగా అందులో వెల్లడైంది. 2011-12కు గాను రూ.5.1 కోట్లు ఇవ్వగా 2013-14 సంవత్సరానికి గాను రూ.75 లక్షలు కేటాయించారట. మహిళా కమిషన్‌కు నిధులు తగ్గించడంపై మాయావతి, రేణుకా చౌదరి తదితరులు మండిపడ్డారు.

English summary

 As women's safety continues to be a cause for concern in Uttar Pradesh, here's a shocker: An activist has found that the Akhilesh Yadav government has drastically downsized the budget of the state women's commission but has the money for two seven-seater Mercedes cars and two similar Land Cruisers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X