ముజఫర్ అల్లర్లు: సిఎం అఖిలేష్కు చేదు అనుభవం
లక్నో: ముజఫర్నగర్లో హింస చేలరేగిన ప్రాంతంలో పర్యటించడానికి వెళ్లిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్కు ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. బాధితులు, విపక్షాల నుండి అఖిలేష్ యాదవ్కు తీవ్ర నిరసన ఎదురైంది.
ముజఫర్ నగర్ అల్లర్ల ఘటనలో 47 మంది వరకు చనిపోయారు. ఇక్కడి కవాల్ గ్రామంలో అఖిలేష్ పర్యటించారు. ఈ సమయంలో ఆందోళనకారులు నల్ల జెండాలతో ఆయనకు నిరసన తెలిపారు. అఖిలేష్కు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అఖిలేష్ కుమార్ తాము ఇచ్చిన మోమోరండాన్ని కూడా తీసుకోలేదని ఆందోళనకారులు ఆరోపించారు.

అల్లర్ల ఘటనపై అఖిలేష్ స్పందిస్తూ.. ఇది చాలా బాధాకరమైనదని, శాంతిగా ఉండాలని తాము మొదటి నుండి కోరుతున్నామని, అల్లర్లు సృష్టించే వారి పైన తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అనంతరం అఖిలేష్ అల్లర్లు జరిగిన మరికొన్ని గ్రామాల్లో పర్యటించారు.
కాగా, ఇప్పటికే ఈ అలర్లను అదుపు చేయడంలో విఫలమైన ముజఫర్నగర్ ఎస్ఎస్పీ సుభాష్ దూబేను విధుల నుంచి తొలగించిన ప్రభుత్వం అతనిపై విచారణకు ఆదేశించింది. ఇక, అల్లర్లు జరిగిన ప్రాంతాలలో విధించిన కర్ఫ్యూను ఆదివారం 12 గంటలు సడలించారు. మరోవైపు, అల్లర్లకు వ్యతిరేకంగా నిరసనగా బాగ్పట్ లోక్సభ నియోజకవర్గం ఎస్పీ అభ్యర్థి సోమ్పాల్ శాస్త్రీ తన టికెట్ను వెనక్కి ఇచ్చేశారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications