వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రివర్స్: అఖిలేష్‌కు తండ్రి దెబ్బ, బీజేపీ హవా.. ఇదీ ఒపీనియన్ పోల్స్...

ఎన్నికల నగారా మోగింది. ఉత్తర ప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అందరి దృష్టి ప్రధానంగా ఉత్తర ప్రదేశ్ పైన ఉంది.

|
Google Oneindia TeluguNews

లక్నో: ఎన్నికల నగారా మోగింది. ఉత్తర ప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అందరి దృష్టి ప్రధానంగా ఉత్తర ప్రదేశ్ పైన ఉంది. సమాజ్ వాది పార్టీలో తండ్రీకొడుకుల రాజకీయ పోరు నేపథ్యంలో మరింత ఆసక్తికరంగా మారింది.

నోట్ల రద్దు ఎఫెక్ట్: 'బీజేపీలో మోడీ పరిస్థితి బాగా లేదు, తప్పించే ప్రయత్నాలు'నోట్ల రద్దు ఎఫెక్ట్: 'బీజేపీలో మోడీ పరిస్థితి బాగా లేదు, తప్పించే ప్రయత్నాలు'

యూపీలో ఎన్నికలు ఏడు విడతల్లో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి సమాజ్ వాది పార్టీయే అధికారంలోకి వచ్చే అవకాశముందని ఏబీపీ న్యూస్ లోక్‌నీతి సీఎస్డీఎస్ ఒపీనియన్ పోల్‌లో తేలింది. ఎస్పీకి 30 శాతం ఓట్లు పడతాయని తేలింది.

సమాజ్‌వాది పార్టీ వైపు మొగ్గినా...

సమాజ్‌వాది పార్టీ వైపు మొగ్గినా...

యూపీలో 402 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎస్పీ ఎక్కువ స్థానాలు గెలుచుకోనున్నప్పటికీ.. అధికారానికి కావాల్సిన సీట్లు మాత్రం గెలుచుకునే అవకాశం లేదని సర్వేలో తేలింది. ఎస్పీ 30 శాతం ఓటు షేర్‌తో 141 నుంచి 151 సీట్లు మాత్రమే గెలుచుకుంటుంది.

దూసుకెళ్లనున్న బీజేపీ, మాయాకు షాక్

దూసుకెళ్లనున్న బీజేపీ, మాయాకు షాక్

సర్వే ప్రకారం.. బీజేపీ బాగా పుంజుకోనుందని ఈ సర్వేలో తేలింది. 27 శాతం ఓట్ షేర్‌తో 129 నుంచి 139 సీట్లు గెలుచుకోనుంది. బీఎస్పీ 22 శాతం ఓట్ షేర్‌తో 93 నుంచి 103 సీట్లు గెలుచుకోనుంది. కాంగ్రెస్ పార్టీ 8 శాతం ఓట్ షేర్‌తో 13 నుంచి 19 స్థానాలు గెలుచుకోనుంది. ఇతరులు 13 శాతం ఓట్ షేర్‌తో 6 నుంచి 12 సీట్లు గెలుచుకోవచ్చు.

తదుపరి ముఖ్యమంత్రిగా..

తదుపరి ముఖ్యమంత్రిగా..

ఉత్తర ప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. 28 శాతం మంది అఖిలేష్‌ మళ్లీ సీఎం అవుతారని భావిస్తున్నారు. రెండో స్థానంలో మాయావతి ఉన్నారు. 21 శాతం మంది బహెన్ సీఎం అవుతారని చెబుతున్నారు. కేవలం 3 శాతం మాత్రమే ములాయం సింగ్ సీఎం అయితే బాగుంటుందంటున్నారు.

యాదవ్ వర్సెస్ మోడీ

యాదవ్ వర్సెస్ మోడీ

ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ పాలన కంటే యూపీ సీఎంగా ఉత్తర ప్రదేశ్ పాలన బేష్‌గా ఉందని 34 శాతం మంది చెబుతున్నారు. 32 శాతం మంది ప్రధాని మోడీ పాలన బాగుందని చెబుతున్నారు.

తండ్రిని మించిన కొడుకు.. తండ్రీ వర్సెస్ కొడుకు

తండ్రిని మించిన కొడుకు.. తండ్రీ వర్సెస్ కొడుకు

గత కొద్ది రోజులుగా తండ్రీ కొడుకుల మధ్య రాజకీయ పోరు సాగుతున్న విషయం తెలిసిందే. పార్టీలో చాలామంది అఖిలేష్ వైపు మొగ్గు చూపుతున్నారు. సర్వేలోను అదే తేలింది. అఖిలేష్ తన తండ్రి ములాయం ద్వారా రాజకీయాల్లో అడుగు పెట్టారు. యాదవులలో పాపులారిటీని తండ్రిని మించారు. అఖిలేష్‌కు 86 శాతం మద్దతు ఉండగా, ములాయంకు కేవలం 6 శాతమే మద్దతు ఉంది. రాంగోపాల్ యాదవ్‌కు 2 శాతం మద్దతు ఉంది.

మైనార్టీ ఓట్లు ఎవరికి?

మైనార్టీ ఓట్లు ఎవరికి?

సర్వే ప్రకారం ముస్లీం మైనార్టీ ఓట్లు 54 శాతం వరకు సమాజ్ వాది పార్టీకే పడనున్నాయి. 14 శాతం బీఎస్పీకి, బీజేపీకి 9 శాతం, కాంగ్రెస్ పార్టీకి 7 శాతం మద్దతుగా ముస్లీం మైనార్టీలు నిలుస్తున్నారు.

అఖిలేష్ వర్సెస్ ములాయం.. బీజేపీకి లాభం చేకూరేనా?

అఖిలేష్ వర్సెస్ ములాయం.. బీజేపీకి లాభం చేకూరేనా?

సమాజ్ వాదిలో ఇటీవలి పరిణామాలు బీజేపీకి లాభిస్తాయని అంటున్నారు. ఎస్పీ చీలిక బీఎస్పీకి పెద్దగా నష్టం లేదా లాభం చేయదని అంటున్నారు. తండ్రీ కొడుకుల గొడవకు ముందు పలు సర్వేలు చేశారు. ఈ సర్వేలలో బీజేపీ రెండో స్థానంలో ఉంది. అయితే తండ్రీ కొడుకుల గొడవకు ముందు ఎస్పీ.. బీజేపీ కంటే 3 శాతం ముందంజలో ఉంది. ఇప్పుడు ఎస్పీ చీలిక దిశలో సాగుతోంది. ఇది బీజేపీకి లబ్ధి చేకూరుతుందని అంటన్నారు.

ఒకవేళ సమాజ్ వాది పార్టీ చీలిపోతే..

ఒకవేళ సమాజ్ వాది పార్టీ చీలిపోతే..

సమాజ్ వాది పార్టీ చీలిపోతే.. అనే దిశలోను సర్వే జరిగింది. చీలిపోతే అప్పుడు రివర్స్ అయ్యే అవకాశముందని ముందస్తు సర్వేలో తేలింది. అదే జరిగితే.. బీజేపీకి 128 నుంచి 168 సీట్లు, బీఎస్పీకి 110 నుంచి 120 సీట్లు, అఖిలేష్ పార్టీకి 82 నుంచి 92 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 14 నుంచి 20 సీట్లు, ములాయం పార్టీకి 9 నుంచి 15 సీట్లు దక్కనున్నాయని సర్వేలో తేలింది.

కులాల వారీగా...

కులాల వారీగా...

క్యాస్ట్ వారీగా అయితే అప్పర్ క్యాస్ట్ ఓటర్లలో 55 శాతం ఓట్ల పైన బీజేపీ ఆశలు పెట్టుకుంది. 75 శాతం యాదవుల ఓట్ల పైన సమాజ్ వాది పార్టీ, ఇక బీఎస్పీ 56 శాతం దళిత ఓట్ల పైన, 74 శాతం జాదవుల ఓట్ల పైన ఆశలు పెట్టుకుంది.

ఉన్నత కులాల్లో 12 శాతం ఓట్లు ఎస్పీకి, 8 శాతం బీఎస్పీకి, 55 శాతం బీజేపీకి, 10 శాతం కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశముంది. యాదవులలో 75 శాతం సమాజ్ వాది పార్టీకి, 4 శాతం బీఎస్పీకి, 14 శాతం బీజేపీకి, 5 శాతం కాంగ్రెస్ పార్టీకి పడనున్నాయి. ఇతర ఓబీసీలు ఎస్పీకి 23 శాతం, బీఎస్పీకి 20 శాతం, బీజేపీకి 34 శాతం, కాంగ్రెస్ పార్టీకి పది శాతం, జాదవులు 7 శాతం ఎస్పీకి, 74 శాతం బీఎస్పీకి, బీజేపీకి 8 శాతం, కాంగ్రెస్ పార్టీకి 4 శాతం, దళిత ఓట్లు ఎస్పీకి 16 శాతం, 56 శాతం బీఎస్పీకి, 13 శాతం బీజేపీకి, 11 శాతం కాంగ్రెస్ పార్టీకి పడనున్నాయి.

ప్రాంతాల పరంగా చూస్తే..

ప్రాంతాల పరంగా చూస్తే..

తూర్పు యూపీలో ఎస్పీ 35 సీట్లు, బీజేపీ 30 సీట్లు, బీఎస్పీ 18 సీట్లు, కాంగ్రెస్ 8 సీట్లు, పడమర యూపీలో బీజేపీకి 37, ఎస్పీకి 16, బీఎస్పీకి 12, కాంగ్రెస్‌కు 4, రోహిఖండ్‌లో ఎస్పీకి 47, బీఎస్పీకి 33, బీజేపీకి 16, కాంగ్రెస్‌కు 1, అవద్ ప్రాంతంలో బీఎస్పీకి 33, బీజేపీకి 26, ఎస్పీకి 25, కాంగ్రెస్‌కు 10, డోబ్ మరియు బుందేల్ ఖండ్‌లలో ఎస్పీకి 25, బీజేపీకి 23, బీఎస్పీకి 21, కాంగ్రెస్ పార్టీకి 12 సీట్లు దక్కే అవకాశముందని సర్వేలో తేలింది.

English summary
The Samajwadi Party (SP) is expected to win 141 to 151 seats in the upcoming Uttar Pradesh elections, according to the latest ABP News-Lokniti CSDS Opinion Poll. This figure takes the SP’s vote share to 30 percent of the total.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X