కర్ణాటక డిప్యూటి సీఎం తోపాటు, కాంగ్రెస్ మంత్రుల రాజీనామా...!
కర్ణాటక రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. రాజీనామ చేసిన ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ మంత్రులు రాజీనామ చేశారు. రాజీనామ చేసిన లేఖలను ముఖ్యమంత్రి కుమారస్వామికి సమర్పించారు. కాగా రాజీనామ చేసిన మంత్రుల్లో ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర కూడ ఉన్నాడు.
ఈనేపథ్యంలోనే ఉపముఖ్యమంత్రి అంతకు ముందు పరమేశ్వర మాట్లాడుతూ.. పార్టీ ఆదేశిస్తే తామంతా రాజీనామ చేస్తామని , వాటిని రాజీనామ చేసిన ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని అన్నారు.కాగా అంతకుముందే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సైతం ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్న గవర్నర్కు లేఖ అందించాడు.
ఇక మరోవైపు ముంబయి హోటల్లో ఉన్న ఎమ్మెల్యేలు అంత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఉన్నారు. వారితో మాట్లాడేందుకు వీలు లేకుండా స్థానిక బీజేపీ నేతలు వారికి కాపాలాగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల కదలికలపై కర్టాటక కాంగ్రెస్ నేతలు నిఘా వేశారు. ఈనేపథ్యంలోనే డిప్యూటి సిఎం సిద్దరామయ్య సైతం రాజీనామ చేసిన ఎమ్మెల్యేల్లో 5 నుండి 6 గురు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ,అలయెన్స్ ప్రభుత్వం కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.