టెక్కీలకు శుభవార్త: ''ఇన్పోసిస్లో అంతా బాగుంది''
బెంగుళూరు: ఇన్పోసిస్లో పరిస్థితులన్నీ చక్కబడ్డాయని ఆ కంపెనీ వ్యవస్థాపకులు నారాయణమూర్తి చెప్పారు.కొన్ని రోజుల క్రితం ఇన్పోసిస్లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కంపెనీ ఛైర్మెన్గా నందన్ నీలేకని బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితులను చక్కదిద్దారని నారాయణమూర్తి అభిప్రాయపడ్దారు.
ఇన్పోసిస్లో కొంత కాలం క్రితం సిఈఓతో పాటు ఉన్నత స్థాయిలో ఉన్న వారంతా రాజీనామాలు చేసి బయటకు వెళ్ళారు. ఈ పరిస్థితుల్లో కంపెనీ షేర్లు పెద్ద ఎత్తున పడిపోయాయి. అయితే కంపెనీ ఛైర్మెన్గా నందన్ నీలేకని బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయని నివేదికలు తెలుపుతున్నాయి.
ఇన్పోసిస్లో పరిస్థితులకు నారాయణమూర్తే కారణమని ఆ సమయంలో కొందరు విమర్శలు కూడ గుప్పించారు. నారాయణమూర్తి కూడ ఆ సమయంలో కంపెనీలో చోటుచేసుకొన్న పరిమాణాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఇన్పోసిస్లో ఆల్ ఈజ్ వెల్
కొన్ని రోజుల క్రితం వరకు ఇన్పోసిస్లో చోటు చేసుకొన్న సంక్షోభ పరిస్థితులన్నీ చక్కబడుతున్నాయని ఆ సంస్థ వ్యవస్థాపకులు నారాయణమూర్తి చెప్పారు.
ఈ సాఫ్ట్వేర్ దిగ్గజంలో నెలకొన్న అన్ని సమస్యలను సరళీకృతం చేసే నైపుణ్యాలను తమ కంపెనీ చైర్మన్ నందన్ నిలేకని కలిగి ఉన్నారని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు.

అంతా బాగుంది
నిజంగా అంతా బాగుంది. ఇన్వెస్టర్లతో జరిగిన సమావేశంలో తాను చెప్పిన మాటలు గుర్తుండే ఉంటాయి. నందన్ చైర్మన్గా ఉన్నారు. ఇక మనం నిక్షేపంగా నిద్రపోవచ్చు అని బెంగళూరులో జరిగిన 2017-18 ఇన్ఫోసిస్ బహుమతుల ప్రధాన కార్యక్రమంలో నారాయణమూర్తి వ్యాఖ్యానించారు.

క్లిష్టమైన సమస్య కూడ నీలేకని ఇలా..
నందన్ నీలేకని చాలా మంచిగా బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తి అని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. క్లిష్టతరమైన సమస్యలను సరళీకృతం చేసే సామర్థ్యం నీలేకనికి ఉందని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. ఇన్ఫోసిస్ నందన్ నీలేకని చేతుల్లోకి వెళ్లినప్పుడు చాలా క్లిష్టతరమైన సమస్యలున్న విషయాన్ని నారాయణమూర్తి గుర్తు చేశారు.

అన్నీసర్దుకొన్నాయి
ఇన్పోసిస్ సంక్షోభంలో ఉన్న సమయంలో నందన్ నీలేకని బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆ సమయంలో
అంతా ఆయనకు వదిలేయండి. అన్ని సర్దుకుంటాయని అన్నారు. నిలేకని తన ఉద్యోగాన్ని చాలా మంచిగా నిర్వర్తిస్తున్నారని తెలిపారు. విశాల్ సిక్కా ఇన్పోసిస్ సిఈఓగా పనిచేసిన సమయంలో ఆయన పనితీరుపై నారాయణమూర్తి బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. నిలేకనికి ఎవరూ సూచనలు ఇవ్వాల్సినవసరం లేదని, ఎందుకంటే ఆయన కూడా మంచి సీఈవో అని మూర్తి అభివర్ణించారు. తనకు తాను మంచి సీఈవో అవడం వల్ల, ఈ పోస్టుకు ఎవరు సరిపోతారో నిలేకనికి తెలుసునని చెప్పారు నారాయణమూర్తి.
-
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
అతడు ఇప్పుడు పక్కా మెంటల్లీ టఫ్: రవిశాస్త్రి -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. -
ఫైనల్ వేళ టీమిండియాకు మాజీ కోచ్ హెచ్చరిక, అభిషేక్ బ్యాటింగ్ ఆర్డర్ ఇక..!! -
మీ పాత బంగారం చెల్లుతుందా? 2026 కొత్త నిబంధనలు ఇవే! -
EPF 2026 అమల్లోకి: డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చో తెలుసా? -
T20 world cup Final: ఫైనల్ అభిషేక్ దే-తేల్చేసిన టీమిండియా హీరో..! -
ఇరాన్ పోరాటం వెనుక రహస్య ఆయుధం? యూఎస్-ఇజ్రాయెల్ కు చిక్కని సీక్రెట్..! -
జీహెచ్ఎంసీ వాసులకు బిగ్ న్యూస్.. వారి ఆస్తులు సీజ్ కు రంగం సిద్ధం! -
ఆ ఉద్యోగుల జీతాలు నిలిపివేత, ఐఏఎస్ ల నుంచి జిల్లా స్థాయి వరకు - నిర్ణయం వెనుక..!!












Click it and Unblock the Notifications