తాజ్మహల్ సహా చారిత్రక కట్టడాలన్నింటికీ గ్రీన్ సిగ్నల్... సందర్శనకు కేంద్రం అనుమతి...
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 25 నుంచి చారిత్రక కట్టడాల సందర్శనను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల విడుదల చేసిన అన్లాక్ 2.0 మార్గదర్శకాల్లో భాగంగా వీటికి సడలింపులనిచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం(జూలై 6) నుంచి ఆగ్రాలోని తాజ్మహల్,ఢిల్లీలోని ఎర్రకోట సహా దేశంలోని పలు చారిత్రక కట్టడాలు తిరిగి సందర్శకులకు స్వాగతం పలకునున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ మొదట లాక్ డౌన్ ప్రకటించడం కంటే ముందే దేశంలోని 3400 చారిత్రక కట్టడాల సందర్శనను నిలిపివేస్తున్నట్లు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా మార్చి 17న ప్రకటించింది. సుమారు రెండు నెలల లాక్ డౌన్ తర్వాత వీటిల్లో ఆయా మతాలకు చెందిన 820 చారిత్రక కట్టడాలకు అన్లాక్ 1.0లో సడలింపులనిచ్చారు.

తాజాగా మిగతా చారిత్రక కట్టడాల సందర్శనకు కూడా కేంద్రం అనుమతించింది. అయితే ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులకు అనుగుణంగా అక్కడి ప్రభుత్వాలకే ఆ నిర్ణయం వదిలేసింది. కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ దీనిపై ట్విట్టర్లో ఒక ప్రకటన చేశారు. జూలై 6వ తేదీ నుంచి అన్ని చారిత్రక కట్టడాల సందర్శనకు అనుమతినిస్తున్నట్లు తెలిపారు. అయితే తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు.
అన్లాక్ 2.0లో స్కూళ్లు,కాలేజీలు,మెట్రో రైళ్లు,సినిమా హాళ్లు,స్విమ్మింగ్ పూల్స్ను కేంద్రం అనుమతించని సంగతి తెలిసిందే. జూలై 31 వరకు వీటిపై నిషేధం కొనసాగనుంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications