లాటరీ స్కాం: సీఏటీని ఆశ్రయించనున్న ఐపీఎస్ అలోక్ కుమార్
బెంగళూరు: వేల కోట్ల రూపాయాల సింగిల్ నెంబర్ లాటరీ స్కాం కేసులో ఆరోపణలు రావడంతో సస్పెండైన సీనియర్ ఐపీఎస్ అధికారి అలోక్ కుమార్ సెంట్రల్ అడ్మినిస్టేటివ్ ట్రిబునల్ (సీఏటీ)ని ఆశ్రయించాలని రంగం సిద్దం చేసుకుంటున్నారు.
లాటరీ స్కాం కేసు దర్యాప్తు చేసిన సీఐడి అధికారులు ఈ కేసులో కింగ్ పిన్ పారి రాజన్ తో నిత్యం అలోక్ కుమార్ టచ్ లో ఉన్నారని, అతని అక్రమ దందాకు సహకరించాడని ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. బెంగళూరు నగర జాయింట్ పోలీసు కమిషనర్ గా పని చేస్తున్న అలోక్ కుమార్ ను మే 23వ తేది సస్పెండ్ చేశారు.

కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ అలోక్ కుమార్ సీఏటీలో అర్జీ సమర్పించాలని నిర్ణయించారు. బుధ, గురువారాలలో అలోక్ కుమార్ ఇదే విషయంపై ఆయన న్యాయవాదులతో చర్చించారు. ఇంకా రెండు రోజుల పాటు సీఐడీ అధికారులు అలోక్ కుమార్ ను ప్రశ్నించనున్నారు.
ఇప్పటికే ఈ సింగిల్ నెంబర్ లాటరీ స్కాం కేసు సీబీఐకి అప్పగిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చెప్పారు. అయితే కర్ణాటక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుండి సీబీఐకి అధికారికంగా ఆదేశాలు అందడానికి సమయం పడుతుందని తెలిసింది. అప్పటి వరకు సీఐడి అధికారులు దర్యాప్తు చేస్తారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications