అమెజాన్ డిస్కౌంట్ల పండగ.. ‘గ్రేట్ ఇండియన్ సేల్’ మొదలైంది..
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నిర్వహిస్తోన్న నాలుగు రోజుల డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ పండుగ ప్రారంభమైంది. గురువారం నుంచి ఆదివారం వరకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ను నిర్వహిస్తోంది.
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నిర్వహిస్తోన్న నాలుగు రోజుల డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ పండుగ ప్రారంభమైంది. గురువారం నుంచి ఆదివారం వరకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ను నిర్వహిస్తోంది.
ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ వస్తువుల దగ్గర్నుంచి, గృహోపకరణాలు, బుక్స్, ఫ్యాషన్ వేర్ వరకు తన ప్లాట్ ఫామ్ పై దొరికే అన్ని వస్తువులపై డిస్కౌంట్లను, క్యాష్ బ్యాక్ లను అమెజాన్ ప్రకటించింది.
మొబైల్, యాక్ససరీస్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై 50 శాతం వరకు, ఫ్యాషన్ ప్రొడక్ట్ లపై 40 శాతం నుంచి 80 శాతం వరకు, హోమ్, కిచెన్ అప్లియెన్స్ పై 70 శాతం వరకు తగ్గింపును అందించనున్నట్టు కంపెనీ తెలిపింది.
టాప్ బ్రాండ్స్ పై బొనాంజా ఆఫర్లు...
త్వరితగతిన డెలివరీ, సులభతరమైన రిటర్న్స్ ను ఈ సేల్ సందర్భంగా అమెజాన్ అందించనుంది. శాంసంగ్, మోటోరోలా, లెనోవో, ప్యూమా, అడిడాస్, ఎల్జీ, బజాజ్ వంటి టాప్ బ్రాండ్లపై బొనాంజా ఆఫర్ల ఉంటాయని అమెజాన్ వెల్లడించింది.
ఆపిల్ ఐఫోన్లపై కూడా...
ఆపిల్ కూడా ఈ సేల్ లో భాగంగా తన ఐఫోన్లపై తగ్గింపు ధరలను ప్రకటించింది. ఆపిల్ ఐఫోన్ 6 (స్పేస్ గ్రే, 32జీబీ) ఫోన్ ను రూ.26,999కు, ఆపిల్ ఐఫోన్ 5ఎస్ (స్పేస్ గ్రే, 16జీబీ) ను 17,783 రూపాయలకు, ఆపిల్ ఐఫోన్7 (బ్లాక్, 32జీబీ)ను 47,790 రూపాయలకు, ఐఫోన్ 6ఎస్ (స్పేస్ గ్రే, 32జీబీ)ను 37,141 రూపాయలకు, ఐఫోన్ ఎస్ఈ (రోజ్ గోల్డ్, 64జీబీ)ను 27,624 రూపాయలకు అందుబాటులో ఉంచుతోంది.
కూల్ ప్యాడ్ ఉత్పత్తులపై...
అదేవిధంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ లో కూల్ ప్యాడ్ కూడా పాలుపంచుకుంటోంది. కూల్ ప్యాడ్ తన నోట్ 5, నోట్ 5 లైట్ స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. గతేడాది లాంచ్ అయిన కూల్ ప్యాడ్ నోట్5 ధర రూ.10,999 కాగ, ఈ ఫోన్ ను రూ.9,999కే అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొంది. అదేవిధంగా ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ చేసిన కూల్ ప్యాడ్ నోట్ 5 లైట్ ను కూడా 6,999కే అందుబాటులో ఉంచుతోంది.