Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కశ్మీర్ లో అదనపు కేంద్ర బలగాలు - జూన్ 15 లోగా పూర్తి : అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష..!!

అమర్​నాథ్​ యాత్రతో పాటు కశ్మీర్​లో అదనంగా కేంద్ర బలగాలను మోహరించాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. జమ్ముకశ్మీర్​లో కొద్ది రోజులుగా హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కశ్మీర్​లో పరిస్థితులు సహా అమర్​నాథ్​ యాత్ర భద్రతపై చర్చించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​, జమ్ముకశ్మీర్​ లెఫ్టినెంట్​ జనరల్​ మనోజ్​ సిన్హా, ఆర్మీ చీఫ్​ జనరల్​ మనోజ్​ పాండే హాజరయ్యారు.

వీరితో పాటుగా యూనియన్​ హోం సెక్రెటరీ అజయ్​ కుమార్​ భల్లా, సీఆర్​పీఎఫ్​ డీజీ కుల్​దీప్​ సింగ్​, బీఎస్​ఎఫ్​ చీఫ్​ పంకజ్​ సింగ్​, జమ్ముకశ్మీర్​ డీజీపీ దిల్బాగ్​ సింగ్​ సహా ఉన్నతాధికారులు అక్కడి పరిస్థితులను నివేదించారు. మే నెల నుంచి వరుసగా హత్యలు జరుగుతుండటంతో..అక్కడి శాంతిభద్రతలపై చర్చించారు.

Amit Shah had held a meeting over targeted killings in Jammu and Kashmir, suggested deployed more forces

మే 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 10 మందిని హత్య చేశారు ఉగ్రవాదులు. బ్యాంకు మేనేజర్​ తొమ్మిదో వ్యక్తి. గురువారమే జరిగిన మరో ఘటనలో కార్మికులు గాయపడ్డారు. జమ్ముకశ్మీర్​లో దాడులు జరుగుతున్న నేపథ్యంలో అమర్​నాథ్​ యాత్రకు భద్రత కట్టుదిట్టం చేయాలని.. కేంద్ర బలగాలను మోహరించాలని అమిత్ షా ఆదేశించారు.

ఉగ్రదాడులను అరికట్టేందుకు జమ్ముకశ్మీర్​లో పోలీస్​ వ్యవస్థను పటిష్ఠపరచాలని నిర్దేశించారు. 350 అదనపు కంపెనీల బలగాలకు ఆమోదం లభించగా.. ఇప్పటికీ 150 కంపెనీలు కశ్మీర్​ చేరుకున్నాయని, మరో 200 కంపెనీలు జూన్​ 10-20 మధ్యలో చేరుకుంటాయని అధికారులు వివరించారు. ఈ నెల 15వ తేదీ లోగా బలగా మొహరింపు పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+