ఏమీ ధైర్యం.. బుల్లెట్ ఫ్రూఫ్ షీల్డ్ తీసిన అమిత్ షా..
జమ్ము కశ్మీర్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. శ్రీనగర్లో ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యారు. అయితే ప్రజలతో మాట్లాడే సమయంలో అమిత్ షా తన బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ షీల్డ్ తీసివేశారు. ఎందుకంటే.. ప్రజలతో తాను ప్రత్యక్షంగా మాట్లాడుతానని కామెంట్ చేశారు. అందుకే తీసివేశానని స్పష్టంచేశారు.
శ్రీనగర్లో గల షేర్ ఏ కశ్మీర్ కన్వెక్షన్ సెంటర్ వద్ద అమిత్ షా ప్రజలతో మమేకం అయ్యారు. ఆయనతోపాటు లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఉన్నారు. మీతో మాట్లాడే సమయంలో బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ ఎందుకు అని అడిగారు. కశ్మీర్ లోయలో ఉన్న ప్రజలు, యువత కోసం మాట్లాడుతున్నానని చెప్పారు.
రెండేళ్ల తర్వాత అమిత్ షా లోయలో పర్యటించారు. ఆర్టికల్ 370 రద్దు చేసి.. జమ్ము కశ్మీర్, లడాఖ్లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చారు. కశ్మీర్లో పౌరులు కాక ఇతరులపై దాడులు జరుగుతున్నాయి. కానీ అమిత్ షా ధైర్యం చేసి ముందడుగు వేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కశ్మీర్లో మరో 5 వేల మంది భద్రతా సిబ్బందిని మొహరించారు. గందెర్బాల్ ఆలయాన్ని కూడా షా సందర్శించారు.