ఎయిర్ అంబులెన్స్ లో మంటలు: పైలెట్ మృతి, డాక్టర్లకు !
బ్యాంకాక్: మేదాంత ఆసుపత్రికి చెందిన ఎయిర్ అంబులెన్స్ విమానంలో ఆకస్మికంగా మంటలు వ్యాపించి పైలెట్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఐదు మంది ప్రయాణిస్తున ఎయిర్ అంబులెన్స్ ను అత్యవసరంగా కిందకు దించివేయడంతో ముగ్గురికి తీవ్రగాయాలైనాయి.
విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ సోషల్ మీడియాలో ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి బ్యాంకాక్ కు మేధాంత ఆసుపత్రి ఎయిర్ అంబులెన్స్ బయలుదేరింది. మార్గం మధ్యలో కోల్ కతాలో ఎయిర్ ఆంబులెన్స్ కు ఇంధనం నింపారు.
తరువాత ఎయిర్ అంబులెన్స్ బ్యాంకాక్ బయలుదేరింది. మార్గం మధ్యలో ఎయిర్ అంబులెన్స్ లో ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి. వెంటనే నఖమ్ పాథమ్ విమానాశ్రయంలో ఎయిర్ అంబులెన్స్ ను ఆకస్మికంగా కిందకుదించేశారు.

అయితే అప్పటికే మంటలు వ్యాపించడంతో పైలెట్ అరుణాక్ష నంది సంఘటనా స్థలంలోనే మరణించారు. తీవ్రగాయాలైన డాక్టర్ శైలేంద్ర, డాక్టర్ కోమల్ లను బ్యాంకాక్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరికీ తీవ్రగాయాలు కావడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
ఈ ప్రమాదంలో మరో నర్సుకు గాయాలు కావడంతో ఆమెకు అక్కడే చికిత్స అందిస్తున్నారని సుష్మా స్వరాజ్ ట్వీట్టర్ లో తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన పైలెట్ కుటుంబ సభ్యులకు సుష్మా స్వరాజ్ ప్రగాడసానుభూతి తెలిపారు.
-
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications