వంటిట్లో సహాయం చేయమని అడిగే భార్యలకు ఈ ఫోటో పంపండీ... ఇంకోసారి అడగరు...!
ఎత్త పెద్ద వ్యాపారవేత్త అయినా, నిత్యం క్షణం తీరీక లేకుండా గడిపే బడా బడా వ్యక్తులకైనా వ్యక్తిజీవీతం అనేది ఉంటుంది. అయితే దాన్ని చాల మంది బయట పెట్టరు. కాని నిత్యం సోషల్ మీడీయాలో ఉంటే ప్రముఖ వ్యాపారవేత్త అనంద్ మహింద్ర మాత్రం రోటిన్కు భిన్నంగా వ్యవహరించాడు. కిచెన్లో మగాళ్లు వేలు పెడితే ఎలా ఉంటుందో ఓ ఫోటోతో తేల్చి చెప్పాడు. దీంతో ఆ ఫోటో సోషల్ మీడీయాలో వైరల్ అవుతోంది.
హ్యూమరస్ ఫోటోను ట్వీట్ చేసిన మహింద్ర
ప్రముఖ వ్యాపారవేత్త అనంద్ మహింద్ర ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఆక్టీవ్గా ఉంటున్న విషయం తెలిసిందే... సమాజంలో జరిగే సంఘటనలపై అనునిత్యం స్పందిస్తారు. తనవంతు సహయం అవసరమనుకుంటే వెంటనే అందిస్తాడు. దీంతోపాటు పలు సామాజిక అంశాలను కూడ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తాడు. అయితే ఈ సారి మాత్రం రోటిన్కు బిన్నంగా వ్యవహరించాడు. సామాజీక అంశంతో పాటు తన కుటుంభానికి సంబంధించిన అంశాన్ని కూడ జోడించాడు.
తన ఇంట్లో జరిగిన సంఘటనను పోస్ట్ చేసిన మహింద్ర
ఇటివల వారం రోజుల పాటు ముంబాయిలో భారి వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.. వర్షాల దెబ్బకు జనజీవనం స్థంబించిపోవడంతోపాటు, పలు విమానాలతో పాటు నగరంలో రవాణ మొత్తం స్ధంభించింది. ఈనేపథ్యంలోనే ఇంట్లో ఉన్న ఖాళీగా ఉన్న ఆనంద్ మహింద్రను తన భార్య వంటలో సాయం చేస్తారా అని అడిగిందట.. అయితే నిరాకరించని మహింద్ర ఇటివల ఓ సోషల్ మీడీయాలో వచ్చిన ఫోటోను పోస్టు చేశాడు.
మగాళ్లు వంటింట్లో పని చేస్తే ఎలా ఉంటుందో చెప్పిన మహింద్ర
ఇక ఆ ఫోటో ఎంటంటే ఇస్త్రి పెట్టేతో చపాతీని వేడి ఓ యువకుడి ఫోటో... ఇక ఫోటోను పంపిణ మహింద్ర తాను వంటింట్లో పని చేస్తే ఇలానే ఉంటుందని రాశాడు. దీంతో ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడీయాలో వైరల్ అవుతోంది. అసలే వ్యాపారవేత్త, ఆయనే తన కుటుంభంలో జరగిన సన్నివేశం గురించి చెప్పడంతో పాటు అది కూడ హ్యూమరస్ ఉంటే ట్వీట్ను చేయడంతో సోషల్ మీడీయాలో వైరల్ అవుతోంది. వేలాదీ మంది ఈ ట్వీట్ను లైక్ చేశారు.