బెంగాల్ గవర్నర్ రాజీనామా.. షాక్ లో దీదీ..!
దేశ రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామాను రాష్ట్రపతికి పంపించారు. ఈ విషయాన్ని బెంగాల్ గవర్నర్ ఓఎస్డీ ధ్రువీకరించింది. ఇక బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ రాజీనామాపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ గవర్నర్ ఆకస్మిక నిర్ణయం తనను షాక్ కు గురి చేసినట్లు పేర్కొన్నారు. సీవీ ఆనంద బోస్ ఎందుకు రాజీనామా చేశారో ఇప్పటికీ తనకు అర్థం కావడం లేదని అన్నారు.
బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తాజాగా రాజీనామా చేశారు. అయితే బెంగాల్ గవర్నర్ రాజీనామాపై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నిర్ణయం తనను షాక్, ఆందోళనకు గురిచేసిందని అన్నారు. సీవీ ఆనంద బోస్ ఎందుకు రాజీనామా చేశారో ప్రస్తుత పరిస్థితుల్లో తనకు తెలియదని తెలిపారు. అయితే కేంద్ర హోం మంత్రి ఒత్తిడి కారణంగానే ఆయన రాజీనామా చేసినట్లు ఆరోపణలు చేశారు దీదీ. త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

బెంగాల్ కొత్త గవర్నర్ గా ఆర్. ఎన్ రవిని నియమించిన విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పుడే తనకు చెప్పారని మమతా బెనర్జీ పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై తనను ఇంతకుముందు ఎప్పుడూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. ఇలాంటి ఏకపక్ష నిర్ణయాల్ని తీసుకోవడం కేంద్ర ప్రభుత్వం ఆపాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications