ఆంధ్రప్రదేశ్: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలుగు దేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.
హైదరాబాద్లో ఉన్న పవన్, హైదరాబాద్లోనే ఉన్న చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం 11.40 ప్రాంతంలో పవన్ బాబు ఇంటికి చేరుకున్నారు.
ఆంధ్రలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తిగా మారింది.
గతంలో విశాఖపట్నంలో పవన్ పర్యటనపై ఆంక్షలు విధించినప్పుడు పవన్ను చంద్రబాబు కలసి తన సంఘీభావం ప్రకటించారు.
తాజాగా కుప్పంలో చంద్రబాబు పర్యటనపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో పవన్ చంద్రబాబుకు తన సంఘీభావాన్ని ప్రకటించడానికి కలిశారని రెండు పార్టీల వర్గాలూ చెబుతున్నాయి.
- ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ఇరుకు సందులు, రోడ్లపైనే సభలు ఎందుకు పెడుతున్నాయి?
- కాపు రిజర్వేషన్లు: కేంద్రం ప్రకటనలో మతలబు ఏమిటి? బీజేపీ వ్యూహం ఏమిటి?

ఏం చర్చించబోతున్నారు?
తెలంగాణలో పోటీ, ఆంధ్రలో భవిష్యత్తు ప్రణాళిక అంశాలపై వారు చర్చించనున్నారు.
జగన్ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ ఇప్పటికే తన వైఖరి స్పష్టం చేశారు పవన్.
ప్రస్తుతం బీజేపీతో ఉన్న పవన్, తనకు బీజేపీ ఇచ్చే రూట్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నట్టు గతంలో చెప్పారు కూడా.
ఈ పరిస్థితుల్లో తాజా సమావేశంపై ఆసక్తి పెరిగింది.
(నోట్: ఈ కథనం అప్డేట్ అవుతోంది)
ఇవి కూడా చదవండి:
- అస్సాం: 'మా ఇళ్లు కూల్చడానికి బదులు మమ్మల్ని చంపేయండి’
- రాహుల్ గాంధీ: 'మోదీ చేయనిది.. రాహుల్ చేశారు’ – భారత్ జోడో యాత్ర గురించి విదేశీ మీడియా ఎలా విశ్లేషిస్తోంది?
- జోషిమఠ్ 'కుంగిపోతోంది’ - కుప్పకూలిన ఆలయం.. ఇళ్లు వదిలి పోతున్న జనం.. ఈ హిమాలయ నగరంలో ఏం జరుగుతోంది?
- మైనర్ హిందూ బాలిక 'కిడ్నాప్, మతమార్పిడి, వివాహం’.. పాకిస్తాన్లో ఆందోళనలు
- హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ప్రజల కష్టాలేమిటి? మునిసిపాలిటీ పరిధిలోకి వస్తే ఏం జరుగుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications