గాల్వన్ ఘర్షణ: అమరుడైన మరో జవాను, తోటి సైనికులను కాపాడే యత్నంలో గాయాలు
ముంబై: సరిహద్దులో భారత్-చైనాల మధ్య జూన్ 15న చోటు చేసుకున్న ఘర్షణలో మరో జవాను అమరుడయ్యారు. ఈ ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని మాలేగావ్ తాలూకా సాకురి గ్రామానికి చెందిన సచిన్ విక్రమ్ మోరే గురువారం వీర మరణం పొందారు.
గల్వాన్లో విధి నిర్వహణలో ఉండగా, నదిలో పడిపోయిన ఇద్దరు జవాన్లను కాపాడే ప్రయత్నంలో విక్రమ్ అమరుడయ్యారని మహారాష్ట హోంమంత్రి సతేజ్ పాటిల్ తెలిపారు.

మరోవైపు భారత్-చైనాల మధ్య సరిహద్దు వివాదంపై చర్చలు జరుగుతున్నాయి. అయితే, సరిహద్దులోని ఘర్షణ ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకుందామని ఒకపక్క భారత్కు చెబుతూనే.. మరోపక్క వాస్తవాధీన రేఖ వెంబడి బలగాలను మోహరిస్తోంది డ్రాగన్ దేశం.
ఈ క్రమంలో భారత్ కూడా భారీ ఎత్తున సైనిక బలగాలను మోహరిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాల వెంబడి సరిహద్దు ప్రాంతాల్లో భారత భద్రతా బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. చైనా మరోసారి ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా ధీటుగా జవాబిచ్చేందుకు సిద్ధంగా ఉంది భారత సైన్యం.
ఇది ఇలావుండగా, సరిహద్దుల్లో పరిస్థితులు, సైనిక సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోడీకి వివరించనున్నారు భారత సైన్యాధిపతి మనోజ్ ముకుంద్ నరవణే. భారత్-చైనా సరిహద్దుల్లో ఆర్మీ చీఫ్ రెండు రోజుల పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం ప్రధాని మోడీని కలిసి సరిహద్దు వద్ద పరిస్థితిని వివరించనున్నారు.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications