ఏ కారణం లేకుండా అరెస్టా?: సంజయ్ రౌత్కు కోర్టు బెయిల్, చేతులు జోడించిన ఎంపీ
ముంబై: శివసేన (ఉద్ధవ్ థాక్రే పార్టీ) సీనియర్ నేత సంజయ్ రౌత్ బెయిల్పై విడుదలయ్యారు. పాత్రచాల్ మనీలాండరింగ్ కేసులో
ఇరుపక్షాల వాదనలు విన్న ముంబైలోని పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు జడ్జి ఎంజీ దేశ్ పాండే.. రౌత్కు బుధవారం బెయిల్ మంజూరు చేశారు. దీంతో బుధవారం సాయంత్రం రౌత్ జైలు ఆర్ధర్ రోడ్ జైలు నుంచి బయటకు వచ్చారు. తన అనుచరులకు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేశారు.
ఇది ఇలావుండగా, తనకు బెయిల్ మంజూరు చేసిన జడ్జీకి సంజయ్ రౌత్ రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపారు. నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని న్యాయమూర్తి ఎంజీ దేశ్పాండేతో రౌత్ అన్నారు.
ఇందుకు న్యాయమూర్తి కూడా స్పందించారు.

'ధన్యవాదాలు చెప్పాల్సిన పనిలేదు. ప్రతి విషయాన్ని మెరిట్పైనే నిర్ణయిస్తాం. మెరిట్ లేనప్పుడు మేము మా తీర్పును ఇవ్వము' అని న్యాయమూర్తి పాండే బదులిచ్చారు.
పాత్రా చాల్ మనీలాండరింగ్ కేసులో సంజయ్ రౌత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ "చట్టవిరుద్ధంగా" అరెస్టు చేసింది అని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తన వివరణాత్మక ఉత్తర్వుల్లో పేర్కొంది . ప్రత్యేక న్యాయమూర్తి ఎంజీ దేశ్పాండే.. ప్రవీణ్ రౌత్ను సివిల్ వివాదం కారణంగా అరెస్టు చేయగా, సంజయ్ రౌత్ను "కారణం లేకుండా" అరెస్టు చేశారని చెప్పడానికి మాటలు లేవు. ఈ నిజం అబ్బురపరుస్తుంది' అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. వారి అరెస్టు వెనుక సివిల్ వ్యాజ్యాలే కారణమని, ఇది ముందస్తు నేరం కాదని బెంచ్ పేర్కొంది.
అంతకుముందు సంజయ్ రౌత్ విడుదలను అడ్డుకోవాలంటూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కింది కోర్టు ఇచ్చిన బెయిల్ పై స్టే విధించాలని ఈడీ కోరగా.. ఇరుపక్షాల వాదనలకు వినకుండా అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై విచారణను గురువారానికి వాయిదా వేసింది.
#WATCH | Shiv Sena (Uddhav Thackeray faction) leader Sanjay Raut released from Arthur Road jail after Mumbai's PMLA court granted him bail in Patra Chawl land scam case earlier today. pic.twitter.com/9LnLnmV3aI
— ANI (@ANI) November 9, 2022
పాత్రచాల్ మనీలాండరింగ్ కేసులో సంజయ్ రౌత్ ను జులై 31న ఈడీ అరెస్ట్ చేసింది. అప్పట్నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. అరెస్టుకు ముందు రౌత్ ఇంట్లో 9 గంటలపాటు సోదాలు నిర్వహించిన దర్యాప్తు సంస్థ అధికారులు రూ. 11.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ. 10 లక్షలు ప్రత్యేక కవర్లో ఉన్నట్లు సమాచారం.
సోదాల తర్వాత ముంబైలోని ఈడీ జోనల్ కార్యాలయంలో రౌత్ ను ఆరుగంటలపాటు ప్రశ్నించారు. ఆ తర్వాత అతడ్ని అరెస్ట్ చేశారు.
పాత్రచాల్ భూ కుంభకోణంతో సంజయ్ రౌత్, ఆయన సతీమణి వర్షా రౌత్ సహా మరికొంతమందికి సంబంధం ఉందని ఈడీ ఆరోపించింది. ఈ క్రమంలోనే రౌత్ కు చెందిన రూ. 11.15 కోట్ల విలువ చేసే ఆస్తులను జప్తు చేసింది. ఆయన సన్నిహితులకు సంబంధించిన ఆస్తులను కూడా విచారిస్తోంది. రూ. 1,034 కోట్ల విలువైన ఈ స్కాం కేసుకు సంబంధించి రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్ ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications