జైట్లీ అంత్యక్రియలు నేడు: బీజేపీ ఆఫీసులో పార్థీవ దేహం, ప్రముఖుల నివాళులు
న్యూఢిల్లీ: మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అరుణ్ జైట్లీ.. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం 12.07 తుది శ్వాస విడిచారు.
ఢిల్లీ కైలాష్ కాలనీలోని అరుణ్ జైట్లీ నివాసానికి శనివారం సాయంత్రం నుంచి అన్ని పార్టీల నాయకులు చేరుకుని నివాళులర్పించారు. ఆదివారం ఉదయం నుంచి 10.30 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు బీజేపీ ప్రధాన కార్యాలయంలో జైట్లీ పార్థీవదేహాన్ని సందర్శనార్థం ఉంచనున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పించనున్నారు.

నిగమ్బోధ్ ఘాట్ వద్ద మధ్యాహ్నం 2.30గంటలకు అంతిమయాత్ర జరుగుతుందని భారతీయ జనతా పార్టీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. కాగా, బహ్రెయిన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ.. జైట్లీ మరణ వార్త విని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తాను తన ఆప్త మిత్రుడిని కోల్పోయానంటూ కన్నీటిపర్యంతమయ్యారు.
మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తర్వాత మరో ఆప్తమిత్రుడిని కోల్పోవడం తనను ఎంతో బాధకు గురిచేసిందని అన్నారు. వెంటవెంటనే ఇద్దరు మిత్రులను కోల్పోవడం తనను ఎనలేని వేదనకు గురిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications